తప్పు చేస్తే ఈటలను సస్పెండ్‌ చేయాలి: విశ్వేశ్వర్‌రెడ్డి

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో పలువురు నేతలు భేటీ అయ్యారు. శామీర్‌పేటలోని ఈటల నివాసంలో తెజస అధ్యక్షుడు కోదండరాం, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

Published : 28 May 2021 01:39 IST

హైదరాబాద్‌: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో పలువురు నేతలు భేటీ అయ్యారు. శామీర్‌పేటలోని ఈటల నివాసంలో తెజస అధ్యక్షుడు కోదండరాం, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి ఆయనతో సమావేశమయ్యారు. అనంతరం విశ్వేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

రాజకీయాలకు ఇది సరైన సమయం కాదని.. ఈటల తప్పు చేస్తే పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు.  భూములు ఆక్రమిస్తే పార్టీలో ఎందుకు ఉంచారని ఆయన ప్రశ్నించారు. కొత్త పార్టీ గురించి తమకు తొందర లేదని.. కొవిడ్‌ నుంచి గట్టెక్కడమే తమకు కావాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని