ఎగ్జిట్పోల్స్.. మహా కూటమి వైపే మొగ్గు!
బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ ఫలితాలు వెలువడ్డాయి. మూడు దశల ఎన్నికలు నేటితో ముగిసిన నేపథ్యంలో ఆయా సంస్థలు తమ సర్వే వివరాలు...
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. మూడు దశల ఎన్నికలు నేటితో ముగిసిన నేపథ్యంలో ఆయా సంస్థలు తమ సర్వే వివరాలు వెల్లడించాయి. టైమ్స్నౌ- సి ఓటర్, పీపుల్స్ పల్స్, ఏబీపీ న్యూస్, రిపబ్లిక్ జన్కీ బాత్ వంటి సంస్థలు మహా కూటమికి ఆధిక్యం కట్టబెట్టాయి. మహా కూటమికి 120, అధికార ఎన్డీయేకు 116 సీట్లు, ఎల్జేపీకి 1, ఇతరులకు 6 స్థానాలు వస్తాయని టైమ్స్నౌ- సి ఓటర్ పేర్కొంది. ఇక పీపుల్స్ పల్స్ సైతం మహా కూటమివైపే ఓటర్లు మొగ్గినట్లు చూపించింది. ఆ కూటమికి 100-115 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఎన్డీయేకు 90-110 స్థానాలు రావొచ్చని పేర్కొంది. ఎల్జేపీ 3-5, ఇతరులు 8-18 స్థానాలు దక్కించుకుంటాయని పేర్కొంది. ఇక ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో తేజస్వి యాదవ్కు 44 శాతం మంది మద్దతు తెలపగా.. నీతీశ్ కుమార్కు 35 శాతం మద్దతు లభించింది. చిరాగ్ పాస్వాన్కు 7 శాతం మంది ఓటేశారు.
ఇతర సర్వేలు సైతం మహా కూటమికే ఆధిక్యం చూపించినప్పటికీ స్పష్టమైన మెజార్టీకి ఫలానా కూటమికే వస్తుందని పేర్కొనక పోవడం గమనార్హం. దీంతో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఎల్జేపీ, ఇతరులు కీలకంగా మారొచ్చు. మొత్తం మూడు దశల్లో 243 స్థానాలకు గానూ బిహార్లో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. జేడీయూ, భాజపా ప్రధాన పార్టీలుగా ఉన్న ఎన్డీయే మరోసారి అధికారం దక్కించుకోవాలని భావిస్తుండగా.. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు కలిసి ఏర్పడిన మహా కూటమి గట్టి పోటీనిస్తోంది. చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగింది. తుది ఫలితాలు ఈ నెల 10న వెలువడనున్నాయి.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇలా..
మధ్యప్రదేశ్ ఫలితాలు
మధ్యప్రదేశ్లో 28 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సైతం వెలువడ్డాయి. కాంగ్రెస్కు 16-18, భాజపాకు 10-12, ఇతరులు 0-2 స్థానాలు వస్తాయని ఆజ్తక్ పేర్కొంది. జ్యోతిరాధిత్య సింథియా తన అనుచరులతో కలిసి భాజపాలో చేరడంతో ఇక్కడ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా