Exit Polls: పంజాబ్ను ఊడ్చేయనున్న ఆమ్ఆద్మీపార్టీ..?
దిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ఆద్మీ పార్టీ త్వరలోనే పంజాబ్లోనూ పాగా వేసేందుకు సిద్ధమైనట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడిస్తున్నాయి.
ఎగ్జిట్ పోల్స్ అన్నీ చీపురు వైపే మొగ్గు
దిల్లీ: ఎన్నో ఏళ్లుగా సంప్రదాయ పార్టీల అధికారంలో ఉండిపోయిన పంజాబ్ ముఖచిత్రం ఈసారి పూర్తిగా మారనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అక్కడ చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో దేశం దృష్టిని ఆకర్షించిన పంజాబ్.. తాజా ఎన్నికల ఫలితాలతో మరోసారి దేశవ్యాప్తంగా సంచలనంగా మారనున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా దిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ఆద్మీ పార్టీ త్వరలోనే పంజాబ్లోనూ పాగా వేసేందుకు సిద్ధమైనట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడిస్తున్నాయి. వందల ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్, అకాలీదళ్ వంటి దిగ్గజ పార్టీలను మట్టికరిపించి ఒంటి చేత్తోనే అధికారంలోకి రానున్నట్లు ముందస్తు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. పంజాబ్లో అతిపెద్ద పార్టీగా అవతరించనున్న ఆమ్ఆద్మీ.. పెద్ద రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకోనున్నట్లు ఎగ్జిట్ పోల్స్ పేర్కొనడం గమనార్హం.
ఈటీజీ రీసెర్చ్ అంచనాల ప్రకారం, పంజాబ్లో ఆమ్ఆద్మీ అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. మొత్తం 117 అసెంబ్లీ సీట్లకు గానూ 70 నుంచి 75 సీట్లలో ఆప్ గెలువనుందని పేర్కొంది. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పార్టీ పంజాబ్లో 76 నుంచి 90 సీట్లు సొంతం చేసుకోనున్నట్లు ఇండియా టుడే లెక్కగట్టింది. ఇక న్యూస్ఎక్స్-పోల్స్ట్రాట్ ప్రకారం ఆమ్ఆద్మీకి 56 నుంచి 61 వచ్చే అవకాశాలున్నాయని తెలిపింది. రిపబ్లిక్ టీవీ కూడా కేజ్రీవాల్ పార్టీ 62 నుంచి 70 సీట్లలో విజయం సాధించనున్నట్లు అంచనా వేసింది. ఇలా అన్ని సర్వేలూ ఆమ్ఆద్మీవైపే మొగ్గు చూపాయి.
దిల్లీ మంత్రం పనిచేస్తున్నట్లేనా..?
పార్టీ స్థాపించిన అనతికాలంలోనే దేశ రాజధానిలో పాగావేసిన ఆమ్ఆద్మీ, సరిహద్దు రాష్ట్రాలకు విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా పంజాబ్లో గత ఎన్నికల్లో పోటీ చేసి 12 స్థానాలు కైవసం చేసుకుంది. వీలైనప్పుడల్లా దిల్లీ ప్రభుత్వ మోడల్ను వివరిస్తూ పంజాబ్ ఓటర్లకు దగ్గరయ్యే ప్రయత్నం చేసింది. వీటితోపాటు ముఖ్యమంత్రి అభ్యర్థిగా భగవంత్ మన్ను ప్రకటించిన అరవింద్ కేజ్రీవాల్.. విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. ఓవైపు కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూనే మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ను లక్ష్యంగా చేసుకొని ప్రజల్లోకి చొచ్చుకువెళ్లే ప్రయత్నం చేశారు. ఇలా వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్, అకాలీదళ్ పార్టీలకు చెక్ పెడుతూ అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు సిద్ధమైనట్లు ముందస్తు సర్వేలు వెల్లడిస్తున్నాయి.
వర్గపోరుతో కాంగ్రెస్ కుదేలు..!
గతకొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా ప్రాభవం కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీకి ఈసారి పంజాబ్లోనూ పరాభవం తప్పనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా దెబ్బతీశాయనే చెప్పవచ్చు. ముఖ్యమంత్రిగా ఉన్న కెప్టెన్ అమరీందర్సింగ్ పదవికి రాజీనామా చేయడం మొదలు.. కొత్త సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ, నవజోత్సింగ్ సిద్ధూ మధ్య చోటుచేసుకున్న అంతర్గత పోరు వరకూ కాంగ్రెస్ను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. అమరీందర్ రాజీనామా తర్వాత కాంగ్రెస్లో వర్గపోరు మరింత ఎక్కువైంది. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నవజోత్సింగ్ సిద్ధూ ముఖ్యమంత్రి పీఠంపై కన్నేయడం పార్టీని మరింత సంక్షోభంలోకి నెట్టింది. అంతేకాకుండా ఈ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి ఎవరనే విషయాన్ని తేల్చడంలోనూ కాంగ్రెస్ అధిష్ఠానం చేసిన తాత్సారం మరింత కష్టాలను తెచ్చిపెట్టింది. నష్టనివారణ చర్యలు చేపట్టాల్సిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం.. సరైన విధంగా స్పందించకపోవడంతో కీలకంగా ఉన్న పంజాబ్ నుంచి కాంగ్రెస్ నిష్ర్కమించక తప్పని పరిస్థితి ఎదురవుతున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి అల్లుడి అరెస్టుతో..
కాంగ్రెస్ పార్టీ కీలకంగా భావిస్తోన్న పంజాబ్లో.. కొత్తగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన చరణ్జిత్ చన్నీకి ఆది నుంచి కష్టాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఇసుక అక్రమ మైనింగ్ ఆయనను వెంటాడిందనే చెప్పవచ్చు. ఈ వ్యవహారంలో సీఎం అల్లుడు భూపేందర్ సింగ్హనీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించింది. చివరకు అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది. దీంతో అధికార కాంగ్రెస్ అకాలీదళ్, ఆమ్ఆద్మీతోపాటు భాజపా పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. ఇవి కూడా ఎన్నికల్లో ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.
భాజపాపై రైతన్నల ఆగ్రహం..?
పంజాబ్లో ఊహించినట్లుగా భాజపాను పంజాబ్ ఓటర్లు దూరం పెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ గతేడాది అన్నదాతల చేపట్టిన ఉద్యమం యావత్ దేశాన్ని కదిలించింది. చివరకు దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ ఓటర్లు మాత్రం భాజపాను దూరం పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ను వీడి కొత్త పార్టీ పెట్టిన అమరీందర్ సింగ్ భాజపాకు మద్దతు ఇచ్చినప్పటికీ అంతగా ప్రభావం చూపించలేకపోయినట్లు కనిపిస్తోంది. ఇక అకాలీదళ్ కూడా ఈసారి ఎన్నికల్లో చెప్పుకోదగ్గ సీట్లను సాధించలేకపోతున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. దాదాపు అన్ని సర్వేల్లోనూ 10 నుంచి 14 సీట్లలో గెలిచే అవకాశాలే ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భీమిలిలో వైకాపా ఖాళీ!
ప్రకృతి అందాలకు నెలవైన తీరప్రాంత నియోజకవర్గం భీమిలి. ముఖ్యమంత్రి జగన్.. రాజధానిని విశాఖకు మార్చేసి నివాసం ఉండాలని కలలుగన్న ప్రాతం. -
మద్యం అమ్మేది జగనే
2019 ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ సీఎం జగన్ నెరవేర్చలేదని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. -
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
నామినేషన్ల ఘట్టం మొదలైన తొలి రోజే శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామం వెలుగులోకి వచ్చింది. -
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైకాపా అభ్యర్థి బుట్టా రేణుక ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమేనని సీఎం జగన్ ఇటీవల సిద్ధం సభలో చేసిన వ్యాఖ్యలు.. ఆమె అఫిడవిట్లో పేర్కొన్న వివరాలతో మరోసారి చర్చనీయాంశమయ్యాయి. -
వేమిరెడ్డి దంపతుల ఆస్తులు.. రూ.715.62 కోట్లు
నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ తెదేపా అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఆమె భర్త ప్రభాకర్రెడ్డి ఉమ్మడి ఆస్తుల విలువ రూ.715.62 కోట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. -
అబ్బో.. కేసుల్లోనూ ఘనులే
చిత్తూరు వైకాపా అసెంబ్లీ అభ్యర్థి విజయానందరెడ్డిపై ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి 12 కేసులున్నాయి. -
లోకేశ్ తరఫున నామినేషన్ దాఖలు
గుంటూరు జిల్లా మంగళగిరి కూటమి అభ్యర్థి, తెదేపా యువనేత నారా లోకేశ్ తరఫున బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నేతలు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను గురువారం రిటర్నింగ్ అధికారి రాజకుమారికి అందజేశారు. -
రైతులను అప్పుల్లో ముంచిన జగన్
సీఎం జగన్ పాలనలో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. వాటిని కప్పిపుచ్చి ప్రోగ్రెస్ కార్డుల పేరుతో రాష్ట్ర ప్రజలను మరోసారి వంచించడానికి వైకాపా నేతలు ప్రయత్నించడం సిగ్గుచేటని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. -
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
జనసేన అధినేత పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. 22 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో పవన్ పర్యటించనున్నారు. -
మంత్రి బొత్సకు భారీ షాక్
వైకాపా కీలకనేత, మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఆయనకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. -
సీఎం జగన్ అవినీతిపై ఛార్జిషీట్ విడుదల చేస్తాం
ముఖ్యమంత్రి జగన్ అవినీతిపై ఛార్జ్షీట్ రూపొందిస్తామని భాజపా రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ పేర్కొన్నారు. -
తెదేపా శ్రేణులపై లాఠీలతో విరుచుకుపడిన పోలీసులు
నామినేషన్ల ఘట్టం ప్రారంభమైన తొలిరోజు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. -
‘నాడు-నేడు’ కార్యశాల పేరిట వైకాపా డప్పు
గ్రామ స్వరాజ్యం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లోనే ఉందని ప్రభుత్వ విశ్రాంత ముఖ్య కార్యదర్శి, సీఎం సలహాదారుడు అజేయ కల్లం పేర్కొన్నారు. -
భూమన భూముల గుట్టు.. అఫిడవిట్లో రట్టు
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి భూమన అభినయ్రెడ్డి ఎన్నికల అఫిడవిట్ పరిశీలిస్తే.. తితిదే ఉద్యోగులకు ఇళ్ల స్థలాల ఎంపికలో ఉన్న మర్మం బోధపడుతోంది. -
నేడు నామినేషన్ వేయనున్న పురందేశ్వరి
భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి రాజమహేంద్రవరం అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ వేయనున్నట్లు ఆ పార్టీ కార్యాలయం ప్రకటించింది. -
రాష్ట్రంలో నాలుగు చోట్ల మోదీ సభలు
ఎన్డీయే ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ రాష్ట్రంలో నాలుగు బహిరంగ సభలకు హాజరుకానున్నారు. -
అంబటి, అనిల్కుమార్లపై సీఈఓకు తెదేపా ఫిర్యాదు
ఎన్నికల కోడ్కు విరుద్ధంగా టీ కప్పులపై తమ బొమ్మలు ముద్రించి టీ స్టాళ్లకు పంపిణీ చేస్తున్న వైకాపా అభ్యర్థులు అంబటి రాంబాబు, అనిల్కుమార్లపై చర్యలు తీసుకోవాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు. -
పొన్నూరు వైకాపా అభ్యర్థిపై చర్యలకు ఆదేశం
గుంటూరు జిల్లా పొన్నూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డికి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా గురువారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. -
ఏపీలో తొలిరోజు 229 నామినేషన్లు
రాష్ట్రంలో తొలిరోజు లోక్సభ స్థానాలకు 39 నామినేషన్లు, శాసనసభ స్థానాలకు 190 నామినేషన్లు దాఖలయ్యాయి. -
21న తెదేపా అభ్యర్థులకు బి-ఫాంలు
తెదేపా అధినేత చంద్రబాబు ఈ నెల 21న పార్టీ అభ్యర్థులకు స్వయంగా బి-ఫాంలు అందజేయనున్నారు. -
పవన్ సమక్షంలో జనసేనలో చేరికలు
మాజీ మంత్రి దివంగత వట్టి వసంతకుమార్ కుటుంబానికి చెందిన వట్టి పవన్కుమార్ సహా పలువురు నాయకులు గురువారం జనసేనలో చేరారు.
తాజా వార్తలు (Latest News)
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి