Maharashtra: సీఎంగా ఫడణవీస్.. శిందేకు డిప్యూటీ సీఎం పదవి?
ఇంటర్నెట్డెస్క్: మహారాష్ట్ర (Maharahstra) ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామాతో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడినట్లయింది. అయితే ఇప్పుడు తదుపరి సీఎం ఎవరు? ఠాక్రేపై తిరుగుబావుటా ఎగురవేసిన ఏక్నాథ్ శిందే (Eknath Shinde) ప్రభుత్వంలో ఉంటారా? ఆయనకు ఏ పదవికి దక్కనుంది? అనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై మరికొద్ది గంటల్లో స్పష్టత రానుంది. భాజపా నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ (Devendra Fadnavis) నేతృత్వంలోనే కాషాయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. రేపే ఆయన ప్రమాణస్వీకారం ఉండనున్నట్లు సమాచారం.
నేడు భాజపా కీలక సమావేశం..
ఠాక్రే వైదొలగడంతో మహారాష్ట్రలో మళ్లీ భాజపా ప్రభుత్వం ఏర్పడవచ్చనే అంచనాలు మొదలయ్యాయి. శిందే (Eknath Shinde) వర్గం మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు భాజపా గవర్నర్ను సంప్రదించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై చర్చించేందుకు భాజపా కోర్ కమిటీ ఈ మధ్యాహ్నం సమావేశం కానుంది. ఠాక్రే రాజీనామా చేసిన కొద్ది గంటల తర్వాత శిందే.. దేవేంద్ర ఫడణవీస్తో ఫోన్లో మాట్లాడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో రెబల్స్ మద్దతుతో భాజపా ఏర్పాటు ఖాయంగానే కన్పిస్తోంది. తమకు 170 మంది సభ్యుల మద్దతు ఉందని భాజపా చెబుతోంది.
రేపే ప్రమాణ స్వీకారం?
ఈ మధ్యాహ్నం జరిగే సమావేశం తర్వాత భాజపా తమ నిర్ణయాన్ని వెల్లడించే అవకాశాలు కన్పిస్తున్నాయి. మరోసారి దేవేంద్ర ఫడణవీస్ నేతృత్వంలోనే కాషాయ పార్టీ సర్కారును ఏర్పాటు చేయనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. శిందేకు ఉపముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేయనున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఠాక్రేపై తిరుగుబాటు చేసిన మంత్రులకు మళ్లీ అవే శాఖలు దక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ సాయంత్రం భాజపా, శిందే వర్గం గవర్నర్ను కలిస్తే.. రేపు సీఎం, డిప్యూటీ సీఎం ప్రమాణస్వీకారం జరిగే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రెబల్స్లో మొత్తం 12 మందికి మంత్రి పదవులు దక్కే అవకాశముంది.
శిందే ‘శాసనసభాపక్ష’ సమావేశం
శిందేతో కలిసి తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా ప్రస్తుతం గోవా హోటల్లో ఉన్నారు. ఠాక్రే గద్దె దిగిన తర్వాత వీరంతా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ ఉదయం 10 గంటలకు శిందే రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి ‘శాసనసభా పక్ష’ సమావేశం నిర్వహించారు. ఠాక్రేపై తిరుగుబాటు చేసిన తర్వాత అసలైన శివసేన వర్గం తమదేనని శిందే చెబుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శాసనసభాపక్ష నేత హోదాలో నేడు ఆయన సమావేశం నిర్వహించడం గమనార్హం. ఈ సమావేశం అనంతరం శివసేన రెబల్ ఎమ్మెల్యేలంతా ముంబయి చేరుకోనున్నట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Rishi Sunak: రిషి సునాక్ గెలవాలని.. ప్రవాస భారతీయుల హోమాలు
-
Movies News
Bigg Boss Telugu 6: ‘బిగ్బాస్’ మళ్లీ వస్తున్నాడు.. ప్రోమోతో సందడి చేస్తున్నాడు!
-
India News
Assam Rifles: అస్సాం రైఫిల్స్ శిబిరాలపై మిలిటెంట్ల దాడి
-
Sports News
CWG 2022: 90.18 మీటర్ల రికార్డు త్రో.. అభినందించిన నీరాజ్ చోప్రా
-
World News
Trump: ట్రంప్ ఇంట్లో ఎఫ్బీఐ తనిఖీలు
-
India News
India Corona: గణనీయంగా తగ్గిన కొత్త కేసులు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Andhra news: నడిరోడ్డుపై వెంటాడి కానిస్టేబుల్ హత్య
- Sita Ramam: బాలీవుడ్, టాలీవుడ్లో నాకు ఆ పరిస్థితే ఎదురైంది: రష్మిక
- Harmanpreet Kaur: ప్రతిసారి ఫైనల్స్లో మేం అదే తప్పు చేస్తున్నాం: హర్మన్ప్రీత్ కౌర్
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (09/08/2022)
- దంపతుల మాయాజాలం.. తక్కువ ధరకే విమానం టిక్కెట్లు, ఐఫోన్లంటూ..
- Money: వ్యక్తి అకౌంట్లోకి రూ.6వేల కోట్లు.. పంపిందెవరు?
- Asia Cup 2022: ఆసియా కప్ టోర్నీకి బుమ్రా దూరం.. టీమ్ఇండియా జట్టు ఇదే!
- Raghurama: రాజధాని మార్చే హక్కు లేదని విజయసాయి చెప్పకనే చెప్పారు: రఘురామ
- Aaditya Thackeray: ఆ ఇద్దరిలో నిజమైన ముఖ్యమంత్రి ఎవరు?.. ఆదిత్య ఠాక్రే
- Crime news: వాటర్ బాటిల్ కోసం వివాదం.. వ్యక్తిని రైళ్లోనుంచి తోసేసిన సిబ్బంది!