UP Election: ‘తొలి దశ ఎన్నికల్లోనే భాజపాకు కళ్లు, చెవులు తెరచుకుంటాయి’
ఉత్తరప్రదేశ్లో తొలి దశ ఎన్నికల్లోనే భాజపాకు కళ్లు, చెవులు తెరచుకుంటాయని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అధికార పార్టీని ఓడించేందుకు రైతులు, యువకులు ఇప్పటికే నిర్ణయించుకున్నారని తెలిపారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్న...
లఖ్నవూ: ఉత్తర్ప్రదేశ్లో తొలి దశ ఎన్నికల్లోనే భాజపాకు కళ్లు, చెవులు తెరచుకుంటాయని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అధికార పార్టీని ఓడించేందుకు రైతులు, యువకులు ఇప్పటికే నిర్ణయించుకున్నారని తెలిపారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్న కర్హల్ స్థానంలో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం అఖిలేశ్ తొలిసారి ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత ఎన్నికల వాతావరణాన్ని చూస్తుంటే ఇప్పటివరకు మూసి ఉన్న భాజపా ప్రభుత్వ కళ్లు, చెవులు.. మొదటి దశ ఎన్నికల్లోనే తెరుచుకుంటాయన్నారు.
అంతకుముందు ఆగ్రాలోని బాహ్ అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలోనూ అఖిలేష్ ప్రసంగించారు. ప్రస్తుత ఎన్నికల్లో ఎస్పీ శక్తిమంతమైన పోటీదారుగా అవతరించిన నేపథ్యంలో పార్టీకి ఓటేయద్దొంటూ కొందరు ప్రజలను ఫోన్లలో బెదిరిస్తున్నారని ఆరోపించారు. యూపీ భవిష్యత్తు కోసం, రాజ్యాంగ రక్షణకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు. ‘భాజపా ఏదైనా చేయొచ్చు.. అది చేసే వరకు ఎవరికీ తెలియదు. నోట్ల రద్దుపై ఎవరికైనా సమాచారం ఉందా?’ అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేర్లు, రంగులు మాత్రమే మార్చగలరని, కాబట్టి మనం కూడా కొంత మార్పు తీసుకురావాలని పిలుపునిచ్చారు. అంతకుముందు లతా మంగేష్కర్ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అఖిలేష్ యాదవ్.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత లతా దీదీ పేరిట ఏదైనా చేస్తామని చెప్పారు. యూపీలో ఈ నెల 10న మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మూడు నెలల్లో భారాస దుకాణం బంద్: మంత్రి కోమటిరెడ్డి
లోక్సభ ఎన్నికల్లో భారాసకు ఒక్క సీటు కూడా రాదని.. వస్తే తాను దేనికైనా సిద్ధమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ఆ పార్టీ నేతలు చూస్తున్నారని ఆరోపించారు. -
రాయి దాడి కేసు.. బీసీ యువకులను బెదిరిస్తున్నారు: కేశినేని చిన్ని
గులకరాయి దాడి కేసులో పోలీసులు అధికార పార్టీ కనుసన్నల్లో తెదేపాపై కుట్ర పన్నారని విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ఆరోపించారు. -
గులకరాయి డ్రామా.. జగన్లో మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి: అచ్చెన్నాయుడు
సానుభూతి కోసం చేసిన గులకరాయి డ్రామాలో బీసీ బిడ్డను బలిచ్చేందుకు సీఎం జగన్ కుట్ర చేశారని తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. -
మునుపెన్నడూ లేనంత తక్కువగా.. 326 సీట్లలోనే కాంగ్రెస్ పోటీ..
దేశాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్.. మునుపెన్నడూ లేనంత తక్కువగా ఈ సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 326 స్థానాల్లో పోటీ చేస్తోంది. వాటిలో ఇప్పటివరకు 281 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. -
రాష్ట్రానికి విజనరీ కావాలా.. ప్రిజనరీ కావాలా?
ధర్మానికి, అధర్మానికి; న్యాయానికి, అన్యాయానికి; నీతికి, అవినీతికి; టూరిజానికి, శాడిజానికి; విజనరీకి, ప్రిజనరీకి మధ్య జరుగుతున్న పోరాటంలో ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని తెలంగాణ తెదేపా నేత నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. -
త్రిమూర్తులుపై వేటా.. సీటా..?
దళితుల శిరోముండనం కేసులో శిక్ష పడిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులును ఇప్పుడు మండపేట నియోజకవర్గ అభ్యర్థిగా వైకాపా తప్పిస్తుందా..? లేదా ఎమ్మెల్సీ అనంతబాబులాగే కొనసాగిస్తుందా అన్న చర్చ జరుగుతోంది. -
ఎన్నికల్లో కూటమి ప్రభంజనం ఖాయం
తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించబోతోందని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ధీమా వ్యక్తంచేశారు. -
మంత్రి పెద్దిరెడ్డిది అవినీతి సామ్రాజ్యం
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాష్ట్ల్రంలో అవినీతి సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. -
నాకే పాపం తెలియదు
కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిడు, కడప: వివేకా హత్య కేసులో తనకెలాంటి ప్రమేయం లేదని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పునరుద్ఘాటించారు. -
175కు 175 స్థానాలూ ఇవ్వండి
‘రాష్ట్రంలో 58 నెలల మా పాలనా కాలంలో కొత్తగా 17 మెడికల్ కళాశాలలు, నాలుగు సీ పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ లాండింగ్ సెంటర్లు, డిజిటల్ గ్రంథాలయాలు ప్రారంభించి పనులు చేయిస్తున్నాం. -
గొడ్డలిని వదిలేసి గులకరాయి వాడినందుకే కథ అడ్డం తిరిగింది
వైకాపా ట్రేడ్మార్క్ గొడ్డలిని వదిలేసి గులకరాయిని వాడినందుకే కథ అడ్డం తిరిగిందని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. -
సీఎంపై రాయి దాడి ఘటనలో బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోండి
ముఖ్యమంత్రిపై జరిగిన రాయి దాడి ఘటనకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుని, ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనాకు జనసేన పార్టీ నాయకులు వినతిపత్రం అందజేశారు. -
అభివృద్ధి వికేంద్రీకరణ.. అమరావతిలో రాజధాని
ప్రజల ఎజెండా కోసమే సీపీఎం పోరాడుతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు. -
దళితుల ఆశీస్సులున్నంత వరకూ.. ఏ కటకటాలూ ఆపలేవు..
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాల్లో దళితుల ఆశీస్సులు ఉన్నంతవరకూ తనను ఏ కటకటాలూ ఆపలేవని, ఎవరూ ఏమీ చేయలేరని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వ్యాఖ్యానించారు. -
కోడ్ ఉండగా వైకాపా వాళ్లు ధర్నాలెలా చేస్తారు?
సీఎం జగన్పై రాయితో దాడి జరిగిన రోజున వైకాపా వాళ్లు రహదారులపైకి వచ్చి ధర్నాలు, నిరసనలు చేయడం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని తెదేపా నేతలు తెలిపారు. -
తోట త్రిమూర్తులును వైకాపా నుంచి బహిష్కరించాలి
దళితులపై ఏమాత్రం గౌరవమున్నా శిరోముండనం కేసులో 18 నెలల శిక్ష పడిన తోట త్రిమూర్తులును వైకాపా నుంచి బహిష్కరించాలని తెదేపా మాజీ మంత్రి కేఎస్ జవహర్ డిమాండు చేశారు. -
గ్రంధి శీనన్న లోకల్ హీరో అట!.. కారుమూరి మనసు వెన్నట!
మమకారం పంచే గోదావరి జిల్లాలు.. వెటకారానికీ పెట్టింది పేరు. ‘అయ్యబాబోయ్...చాలా గొప్పోరు అండి మీరు’ అంటే అందులో చాలా వెటకారం ధ్వనిస్తుంది. -
ఆ 8 మంది అధికారులను ఏపీ నుంచి తప్పించండి
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సజావుగా, స్వేచ్ఛగా, ప్రజాస్వామ్య బద్ధంగా జరగడానికి 8 మంది అధికారులను తక్షణం బదిలీ చేయాలని ఎన్డీయే కూటమి పార్టీల నేతలు మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. -
జే గ్యాంగ్ బెదిరింపులతోనే అరబిందో ఇన్ఫ్రాకు కాకినాడ పోర్టు
దేశంలో ఎక్కడా పోర్టులు నిర్మించిన, నిర్వహించిన అనుభవం లేని.. కనీసం పోర్టు గోడలకు రంగులు కూడా వేయని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన అరబిందో ఇన్ఫ్రాకు అత్యంత కీలకమైన కాకినాడ పోర్టును ఎలా కట్టబెట్టారని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ధ్వజమెత్తారు. -
ఎన్డీయే ప్రచారానికి ఎన్నారైలు సిద్ధం
ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని కమిటీల్లోనూ ప్రవాసాంధ్రులకు సముచిత స్థానం కల్పిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెదేపా ఎన్నారై విభాగం అధ్యక్షుడు వేమూరి రవికుమార్ వెల్లడించారు. -
రాష్ట్రానికి మరోసారి ప్రధాని మోదీ రాక
రాష్ట్రంలో నిర్వహించబోయే ఎన్డీయే ప్రచార సభల్లో ప్రధాని మోదీతోపాటు భాజపా జాతీయ సీనియర్ నేతలు పాల్గొంటారని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ రాజు వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
అరుదైన ఘటన..బుల్లెట్ ట్రైన్ 17 నిమిషాలు ఆలస్యం
-
మూడు నెలల్లో భారాస దుకాణం బంద్: మంత్రి కోమటిరెడ్డి
-
భారీ వర్షాల ఎఫెక్ట్.. భారత్-దుబాయ్ మధ్య 28 విమానాల రద్దు
-
కోహ్లీనే తక్కువ పరుగులు ఇస్తాడేమో.. బెంగళూరు 11 మంది బ్యాటర్లతో ఆడాలి: క్రిష్
-
రాయి దాడి కేసు.. బీసీ యువకులను బెదిరిస్తున్నారు: కేశినేని చిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM