KS Jawahar: విజయసాయి ఫోన్‌ పోయిందా? జగన్‌ లాక్కున్నారా?: జవహర్‌

తన ఫోన్‌ పోయిందంటూ వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి నాటకాలు ఆడుతున్నారని మాజీ మంత్రి జవహర్‌  విమర్శించారు.

Published : 23 Nov 2022 14:39 IST

అమరావతి: తన ఫోన్‌ పోయిందంటూ వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి నాటకాలు ఆడుతున్నారని మాజీ మంత్రి జవహర్‌  విమర్శించారు. ‘‘దిల్లీ లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి జగన్‌ సహా అందరి వాటాల సమాచారం ఆ ఫోన్‌లోనే ఉంది. ఈడీ విచారణలో బాగోతం బయటపడుతుందని నాటకం ఆడుతున్నారు. ఫోన్‌ దాచేసి పోలీసులకు తప్పుడు ఫిర్యాదు ఇస్తున్నారు. రుషికొండ వాటాల సమాచారం విజయసాయి ఫోన్‌లోనే ఉంది. శరత్‌ అరెస్టు తర్వాత విజయసాయి ఫోన్‌ పోయిందంటున్నారు. నిజంగా పోయిందా? జగన్‌ లాక్కున్నారా?’’ అని జవహర్‌ ఎద్దేవా చేశారు.

విజయసాయిరెడ్డి చరవాణి పోగొట్టుకున్నట్లు.. ఆయన వ్యక్తిగత సహాయకులు లోకేశ్వరరావు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 21 నుంచి చరవాణి కనిపించటం లేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. యాపిల్‌ కంపెనీకి చెందిన ఐఫోన్‌ 12ప్రో చరవాణి పోయిందని విజయసాయి పీఏ తమకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చరవాణిలో అత్యంత విలువైన సమాచారం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు