HCA: కల్వకుంట్ల కుటుంబం వల్లే హెచ్సీఏలో గందరగోళ పరిస్థితులు: వివేక్
హైదరాబాద్: కల్వకుంట్ల కుటుంబం వల్లే హైదరాబాద్ క్రిక్ట్ అసోసియేషన్(హెచ్సీఏ)లో గందరగోళ పరిస్థితులు
హైదరాబాద్: కల్వకుంట్ల కుటుంబం వల్లే హైదరాబాద్ క్రిక్ట్ అసోసియేషన్(హెచ్సీఏ)లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని భాజపా నేత వివేక్ వెంకటస్వామి ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ కవితను హెచ్సీఏ అధ్యక్షురాలిని చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. భారత్, ఆసీస్ మూడో టీ20 మ్యాచ్కు సంబంధించి ఎన్ని టికెట్లు విక్రయించారో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
‘‘సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మ్యాచ్ టికెట్లు విక్రయించామన్నారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలి. ఎన్ని టికెట్లు ఇచ్చారు? ఎన్ని బాక్స్లు, ఎంత మందికి కేటాయించారు? డబ్బులు చెల్లించిన వారికి బాక్స్లు ఇచ్చారా? లేదా? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. గతంలో ఇలాంటి ఘటనలు హెచ్సీఏలో జరగలేదు. తాజా పరిస్థితులకు కారణం కల్వకుంట్ల కుటుంబం. ఎందుకంటే వారికి క్రికెట్ అసోసియేషన్ మీద ధ్యాసలేదు. కానీ, కవితను ఎలాగైనా హెచ్సీఏ అధ్యక్షురాలిని చేయాలని చూస్తున్నారు. క్రీడారంగంలోని అన్ని అసోసియేషన్లో కేటీఆర్, కవిత ఇద్దరిలో ఎవరిదో ఒకరిది పేరు ఉండాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో నేను హెచ్సీఏ అధ్యక్షుడిగా నిలబడతానని చెప్పినపుడు హెచ్సీఏ మీకెందుకు? పోటీ చేయొద్దు అని కేసీఆర్ చెప్పారు’’ అని వివేక్ గుర్తు చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి