Gali Janardhan: రాజకీయాల్లో.. ఇక ‘ఫుట్బాల్’ ఆడుకుంటా..!
‘కల్యాణ రాజ్య ప్రగతి పక్ష’ పార్టీని స్థాపించిన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్రెడ్డి(Gali Janardhana Reddy).. సోమవారం పార్టీ గుర్తు ‘ఫుట్బాల్’ను ఆవిష్కరించారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 12 అభ్యర్థులతోకూడిన జాబితా, ఎన్నికల మేనిఫెస్టోనూ విడుదల చేశారు.
బెంగళూరు: గనుల అక్రమ తవ్వకాల(Illegal Mining)కు సంబంధించిన కేసులో విచారణను ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్రెడ్డి(Gali Janardhana Reddy).. కల్యాణ రాజ్య ప్రగతి పక్ష(Kalyana Rajya Pragati Paksha) పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం ఆయన పార్టీ ఎన్నికల గుర్తుగా ‘ఫుట్బాల్(Football)’ను కేటాయించింది. సోమవారం ఈ విషయాన్ని ప్రకటించిన ఆయన.. కర్ణాటక(Karnataka)లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 12 మంది అభ్యర్థులతోకూడిన జాబితా, ఎన్నికల మేనిఫెస్టోనూ విడుదల చేశారు. కొప్పల్ జిల్లా గంగావతి నుంచి తాను, బళ్లారి సిటీ నియోజకవర్గం నుంచి తన సతీమణి అరుణలక్ష్మి ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు.
‘ఇదివరకు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న సమయంలో.. సొంతవారు, ఇతరులు, శత్రువులనే తేడా లేకుండా అందరూ నన్ను ఫుట్బాల్ ఆడుకున్నారు! ఇప్పుడు నేనూ వారితో ఫుట్బాల్ ఆడగలనని నిరూపించేందుకు రంగంలోకి దిగా’ అని జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ‘ఐదెకరాల్లోపు భూమి ఉన్న రైతులకు ఏటా రూ.15 వేల ఆర్థిక సాయం, రైతులకు రోజూ 9 గంటల ఉచిత కరెంటు, గృహిణులకు నెలకు 2,500 ఆర్థిక సాయం, ప్రతి ఇంటికి 250 యూనిట్ల ఉచిత విద్యుత్, నిరుద్యోగ యువతకు నెలకు రూ.2,500 నిరుద్యోగ భృతి’ తదితర హామీలతో కూడిన మేనిఫెస్టోను ఈ సందర్భంగా విడుదల చేశారు.
మైనింగ్ కుంభకోణంలో అరెస్టు మొదలు.. దాదాపు 12 ఏళ్లుగా గాలి జనార్దన్రెడ్డి రాజకీయంగా నిష్క్రియంగా ఉన్నారు. ప్రస్తుతం పార్టీని స్థాపించడం, ఎన్నికల్లో పోటీ చేయడం వంటిని తన రాజకీయాలను మళ్లీ నిలబెట్టుకునే ప్రయత్నంగా రాజకీయ విశ్లేషకులు చూస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో.. ముఖ్యంగా బళ్లారి బెల్ట్లో ఓట్లను చీల్చడం ద్వారా భాజపాపై కేఆర్పీపీ కొంత ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు. కేఆర్పీపీ ప్రధానంగా కల్యాణ- కర్ణాటక(పూర్వపు హైదరాబాద్- కర్ణాటక) ప్రాంతంలోని కొన్ని నియోజకవర్గాలు, తెలుగు జనాభా అధికంగా ప్రాంతాలపై దృష్టి సారించింది. ఇదిలా ఉండగా.. జనార్దన్రెడ్డికి గతంలో భాజపాతో రెండు దశాబ్దాల అనుబంధం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
-
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
-
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది నేవీ సిబ్బంది మృతి
-
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
-
ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 పైన నిఫ్టీ