TS News: ప్రవీణ్కుమార్ భయంతో వీఆర్ఎస్ తీసుకున్నారు: తెరాస
హైదరాబాద్: ఉద్యోగం పోయే పరిస్థితుల్లో ప్రవీణ్కుమార్ వీఆర్ఎస్ తీసుకున్నారని తెరాస ఎమ్మెల్యే గాదరి కిషోర్కుమార్ ఆరోపించారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న తెరాసపై విమర్శలు చేస్తున్న ప్రవీణ్కుమార్.. ఏ కార్యక్రమాలు చేయకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాను ఎందుకు ప్రశ్నించరని అన్నారు.
‘‘ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, దళిత జాతిని పైకి తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. వాటిల్లో పాలు పంచుకున్న ప్రవీణ్గారు.. ఒక్క రూపాయి దళితుల కోసం పనిచేయకుండా, ఇస్తామన్న ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించరు. ఎందుకంటే, ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి, ఇష్టం వచ్చిన ప్రమాణాలు చేయించి, ఇష్టారీతిగా వ్యవహరిస్తే కేసులు పెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. దీంతో ఉద్యోగం ఉంటుందో, పోతుందోనన్న భయాందోళనతో జాతికోసం బయటకు వస్తున్నట్లు ప్రకటించారు. మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు బహుజన్ సమాజ్పార్టీలో చేరారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఏమైనా అంటే, ఏమవుతోందనన్న భయం ఆయనలో ఉంది. ఇది గమనించాలని తెలంగాణ దళిత జాతిని కోరుతున్నా’’
‘‘ప్రతి పదేళ్లకొకసారి ఇలాంటి వాళ్లు బయలుదేరతారు. దళిత జాతి బాగుపడుతుంటే వాళ్లను ఆగమాగం చేసి, గందరగోళం చేయాలని చూస్తారు. దళితులకు ప్రమోషన్స్, ఉద్యోగాలు, సంక్షేమ కార్యక్రమాలు దేశంలో మరే రాష్ట్రంలో జరగని విధంగా సీఎం కేసీఆర్ తెలంగాణలో చేస్తున్నారు. ఎప్పటికైనా విజయం సాధించేది ప్రజలేనని కేసీఆర్ అంటారు. సందర్భాన్ని బట్టి, ఎవరిని నమ్మాలి.. ఎవరికి చురకలు పెట్టాలో ప్రజలకు బాగా తెలుసు. గతంలో చాలా మంది అధికారులు పార్టీలు పెట్టి చేతులు కాల్చుకున్నారు. ఇలాంటి పార్టీలు వస్తుంటాయి.. పోతుంటాయి.. ప్రజల కోసం ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాం. మీరు భాజపా ప్రయోగిస్తున్న కుట్రలో భాగంగా వస్తున్నారు. వాళ్లు మిమ్మల్ని పావుగా వాడుతున్నారు. దేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలను విచ్ఛినం చేసే దిశగా భాజపా ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయాన్ని ప్రవీణ్కుమార్ గ్రహించాలి. దళిత బంధులాంటి కార్యక్రమాలు చేపడుతున్న సీఎం కేసీఆర్ను విమర్శించడం సిగ్గుచేటు. త్వరలోనే మీకు కనువిప్పు కలుగుతుంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కారు విజయం తథ్యం.’’ అని కిషోర్ అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Gastritis: వానాకాలంలో వచ్చే ముప్పు ఏంటో తెలుసా..?
-
Sports News
Bangladesh Cricket : బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అనూహ్య నిర్ణయం..
-
India News
Tamilnadu: తమిళనాడు మంత్రి కారుపై చెప్పు విసిరిన ఘటన.. భాజపా కార్యకర్తల అరెస్ట్
-
World News
Tunnel: బ్యాంకు లూటీకి ఏకంగా సొరంగం తవ్వకం.. ఆపై ఊహించని ఘటన!
-
India News
Chennai: విమానంలో వచ్చిన ప్రయాణికుడి వద్ద కొండచిలువలు, తాబేళ్లు, కోతి!
-
India News
Uddhav Thackeray: ‘త్రివర్ణ పతాకాన్ని ఎగరేయడం వల్ల దేశ భక్తులు కాలేరు’
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Bangladesh Cricket : బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అనూహ్య నిర్ణయం..
- Tunnel: బ్యాంకు లూటీకి ఏకంగా సొరంగం తవ్వకం.. ఆపై ఊహించని ఘటన!
- MS Dhoni : దక్షిణాఫ్రికా టీ20 లీగ్లో మెంటార్గా ధోనీ సేవలు ఈసారికి కష్టమే!
- BJP: ఎన్నికల్లో పోటీ చేస్తా.. పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా రెడీ: జీవితా రాజశేఖర్
- Uddhav Thackeray: ‘త్రివర్ణ పతాకాన్ని ఎగరేయడం వల్ల దేశ భక్తులు కాలేరు’
- cardiac: ఛాతీలో నొప్పిగా ఉందా..? ఎందుకో తెలుసుకోండి..!
- Yuan Wang 5: అభ్యంతరం తెలుపుతున్నప్పటికీ.. చైనా నౌకకు శ్రీలంక మరోమారు అనుమతి
- శ్రీవారి దర్శనానికి రెండ్రోజుల సమయం.. 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు: తితిదే
- RRR: ఆర్ఆర్ఆర్ టీమ్కు సర్ప్రైజ్ ఇచ్చిన గూగుల్.. ఏం చేసిందంటే?
- Viral Video: క్షణం ఆలస్యమైనా పాము కాటేసేదే..! అంతలో ఏం జరిగిందంటే