Munugode bypoll: మునుగోడు బరిలో ప్రజాగాయకుడు గద్దర్‌

ప్రజాగాయకుడు గద్దర్‌ తొలిసారి ఎన్నికల్లో  పోటీచేయబోతున్నారు. త్వరలో జరగనున్న మునుగోడు ఉప ఎన్నికలో ప్రజాశాంతిపార్టీ తరఫున ఆయన బరిలోదిగనున్నారు.

Published : 06 Oct 2022 01:59 IST

హైదరాబాద్‌: ప్రజాగాయకుడు గద్దర్‌ తొలిసారి ఎన్నికల్లో  పోటీచేయబోతున్నారు. త్వరలో జరగనున్న మునుగోడు ఉప ఎన్నికలో ప్రజాశాంతిపార్టీ తరఫున ఆయన బరిలోదిగనున్నారు. ఈమేరకు ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత కేఏ పాల్‌ ప్రకటించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నట్టు గద్దర్‌ తెలిపారు. ప్రపంచశాంతి కోసం కృషి చేస్తున్న పాల్‌తో కలిసి పనిచేయాలనే ఉద్దేశంతోనే ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ప్రజల ఆశీర్వాదం కోసం రేపటి నుంచే ప్రచారం ప్రారంభిస్తానన్నారు. నవంబరు 3న మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌, 6న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని