
దీదీ.. గాయాన్ని రాజకీయం చేయకండి
ప్రత్యేక ఇంటర్వ్యూలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ హితవు
కోల్కతా: ఇటీవల నందిగ్రామ్లో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ గాయపడిన ఘటనపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. ఆ ఘటన స్వల్ప ప్రమాదమేనని, ఎన్నికల్లో గెలిచేందుకు దీదీ ఎమోషనల్ కార్డు ప్రయోగిస్తున్నారని ప్రజలకు అర్థమైపోయిందని వ్యాఖ్యానించారు. తృణమూల్ కాంగ్రెస్కు జనం ఓట్లు వేయరని తెలిపారు. సోమవారం పశ్చిమబెంగాల్లో ఎన్నికల ప్రచారానికి ప్రత్యేక విమానంలో వెళ్తూ ‘ఈటీవీ భారత్’ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో గడ్కరీ మాట్లాడుతూ.. ‘‘మమతకు జరిగింది ప్రమాదమేనని అందరూ అంటున్నారు. ఈ ఘటనను రాజకీయం చేయొద్దు. దీదీ, మేము ప్రజా కోర్టుకు వెళ్తున్నాం. ప్రజలు ఇచ్చే నిర్ణయాన్ని అంగీకరించేలా ముందుకు సాగాలి’’ అన్నారు.
200 స్థానాల్లో గెలుపు మాదే!
ఈ ఎన్నికల్లో భాజపాకు 200 సీట్లు రావడం ఖాయమని గడ్కరీ విశ్వాసం వ్యక్తంచేశారు. కార్యకర్తల అవిశ్రాంత కృషి, ప్రజలు ఇచ్చిన తీర్పు ద్వారా భాజపా లక్ష్యం నెరవేరబోతోందన్నారు. ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చినా అంగీకరించాలన్నారు. వివాదాలు సృష్టించడం, ఎన్నికల వాతావరణాన్ని చెడగొట్టడం సరైంది కాదని హితవు పలికారు. నందిగ్రామ్లో దీదీ గాయపడిన ఘటన దురదృష్టకరమన్న గడ్కరీ.. దీన్ని రాజకీయం చేయొద్దని ఆమెకు విజ్ఞప్తి చేశారు. బెంగాల్ ప్రజలు ఈసారి భాజపాను ఆదరిస్తే రాష్ట్రంలోని రెండు భారీ జాతీయ రహదారి ప్రాజెక్టుల్ని రెండేళ్లలోనే పూర్తిచేస్తామని గడ్కరీ హామీ ఇచ్చారు.
పశ్చిమ బెంగాల్లో 294 అసెంబ్లీ స్థానాలకు ఎనిమిది విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 27న తొలి విడత పోలింగ్ ప్రారంభం కానుండగా.. ఏప్రిల్ 29న అక్కడ తుది విడత ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Chemist killing: నుపుర్ శర్మ వివాదంలో మరో హత్య ..! దర్యాప్తు ఎన్ఐఏ చేతికి..
-
India News
IRCTC: కప్ టీ ₹70.. రైల్వే ప్రయాణికుడి షాక్.. ట్వీట్ వైరల్!
-
Politics News
Pawan Kalyan: కుల, మతాల ప్రస్తావన లేని రాజకీయాలు రావాలి: పవన్
-
General News
Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి
-
Movies News
Samantha: విజయ్ దేవరకొండ రూల్స్ బ్రేక్ చేయగలడు: సమంత
-
World News
Ukraine crisis: ఉక్రెయిన్కు అమెరికా మరోసారి చేయూత.. 820 మిలియన్ డాలర్ల సాయం ప్రకటన
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- RaviShastri: బుమ్రా బ్యాటింగ్కు రవిశాస్త్రి ఫిదా.. బీసీసీఐ ప్రత్యేక వీడియో..!
- Weekly Horoscope : రాశిఫలం ( జులై 03 - 09 )
- IND vs ENG: ముగిసిన రెండో రోజు ఆట.. టీమ్ఇండియాదే పైచేయి
- Vikram: విక్రమ్ న్యూ ఏజ్ కల్ట్ క్లాసిక్.. అందుకు నా అర్హత సరిపోదు: మహేశ్బాబు
- Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి
- social look: లవ్లో పడిన రష్మి.. జిమ్లో పడిన విద్యురామన్.. ‘శ్రద్ధ’గా చీరకడితే..
- IND vs ENG: యువరాజ్ సింగ్ను గుర్తుచేసిన బుమ్రా
- తప్పుడు కేసుపై 26 ఏళ్లుగా పోరాటం.. నిర్దోషిగా తేలిన 70ఏళ్ల వృద్ధుడు
- Samantha: విజయ్ దేవరకొండ రూల్స్ బ్రేక్ చేయగలడు: సమంత
- Chemist killing: నుపుర్ శర్మ వివాదంలో మరో హత్య ..! దర్యాప్తు ఎన్ఐఏ చేతికి..