Gandra Venkata Ramana Reddy: రేవంత్‌ మాటతీరు మార్చుకోవాలి: గండ్ర వెంకట రమణారెడ్డి

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తన మాటతీరు మార్చుకోవాలని.. లేకుంటే సహించేది లేదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.

Updated : 01 Mar 2023 15:00 IST

భూపాలపల్లి: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తన మాటతీరు మార్చుకోవాలని.. లేకుంటే సహించేది లేదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. భూపాలపల్లిలోని భారాస కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గండ్ర దంపతులు మాట్లాడారు. ‘హథ్‌సే హాథ్‌ జోడో’ యాత్రలో భాగంగా రేవంత్‌, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ గండ్ర సత్యనారాయణ తమపై చేసిన ఆరోపణలను వారు ఖండించారు. దీనిపై బహిరంగ చర్చకు వస్తామని.. కాంగ్రెస్‌ నేతలు సిద్ధమా? అని వెంకటరమణారెడ్డి సవాల్‌ విసిరారు. 

గురువారం ఉదయం 11 గంటలకు భూపాలపల్లిలోని అంబేడ్కర్‌ సెంటర్‌కు తాము వస్తామని.. కాంగ్రెస్‌ నేతలు ఆధారాలతో రావాలని కోరారు. తాము విసిరిన సవాల్‌ను స్వీకరించాలన్నారు. మంగళవారం భూపాలపల్లిలో రేవంత్‌, కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతూ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భూ అక్రమాలు, కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆ ఆరోపణలను నిరూపించాలని ఎమ్మెల్యే సవాల్‌ విసిరారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని