గంటా వైకాపాలో చేరే అవకాశం: విజయసాయి
మాజీమంత్రి, తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు త్వరలో వైకాపాలో చేరే అవకాశముందని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. గంటా అనుచరుడు కాశీ విశ్వనాథ్ బుధవారం వైకాపాలో చేరారు. ..
విశాఖపట్నం: మాజీమంత్రి, తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు త్వరలో వైకాపాలో చేరే అవకాశముందని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. గంటా అనుచరుడు కాశీ విశ్వనాథ్ బుధవారం వైకాపాలో చేరారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. జగన్ పాలన చూసి చాలా మంది వైకాపాలో చేరుతున్నారన్నారు. ‘గంటా శ్రీనివాసరావు కొన్ని ప్రతిపాదనలు పంపారు. జగన్ ఆమోదం తర్వాత గంటా పార్టీలోకి వచ్చే అవకాశముంది’’ అని తెలిపారు. మరో వైపు.. వైకాపాలో గంటా చేరిక ప్రతిపాదనను మొదటి నుంచి మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యతిరేకిస్తున్నారు. బుధవారం విశాఖలో జరిగిన కాశీవిశ్వనాథ్ వైకాపాలో చేరిక కార్యక్రమానికి అవంతి శ్రీనివాస్ దూరంగా ఉన్నారు. దీంతో విశాఖ వైకాపాలో వర్గపోరు మొదలైందనే వాదనలు వినిపిస్తున్నాయి.
గత ఎన్నికల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి తెదేపా తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన వాసుపల్లి గణేష్కుమార్ ..ఆ తరువాత పరిణామాల నేపథ్యంలో వైకాపాకు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి గంటా శ్రీనివాసరావు కూడా వైకాపాలో చేరతారనే ప్రచారం జరిగింది. గంటా వైకాపాలో చేరికను వ్యతిరేకిస్తూ మంత్రి అవంతి శ్రీనివాసరావు బహిరంగంగా విమర్శలు కూడా చేశారు. ఆయన వర్గం ధర్నాలు కూడా నిర్వహించింది. ఆ తర్వాత కొంతకాలం ఈవిషయంపై చర్చ జరగలేదు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గంటా వైకాపాలో చేరే అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈమేరకు రాజీనామా లేఖను శాసనసభ స్పీకర్కు పంపారు. ప్రస్తుతం రాజీనామా లేఖ స్పీకర్ వద్ద పెండింగ్లో ఉంది. గత కొంత కాలంగా తెలుగుదేశం పార్టీ సమావేశాలకు దూరంగా ఉంటున్న గంటా.. ఇటీవల చంద్రబాబు విశాఖ వచ్చినప్పుడు ఆయన వెంట ఉన్నారు. తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు దీక్షకు కూర్చున్నప్పుడు శిబిరం వద్దకు వచ్చి మద్దతు తెలిపారు. పోలీసులు దీక్ష భగ్నం చేయడంతో... చంద్రబాబుతో పాటు ఆసుపత్రికి వెళ్లి పల్లా శ్రీనివాసరావును పరామర్శించారు. గంటా శ్రీనివాసరావు తాను పార్టీ మారుతున్నట్టు ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని