TS News: నైతిక విజయం తెరాస పార్టీదే: గెల్లు శ్రీనివాస్‌

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితం వెలువడిన తర్వాత తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ స్పందించారు. కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...

Updated : 09 Aug 2022 12:28 IST

కరీంనగర్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితం వెలువడిన తర్వాత తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ స్పందించారు. కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తెరాసకు ఓటేసిన ఓటర్లకు పాదాభివందనం చేస్తున్నట్టు తెలిపారు. ‘‘నా గెలుపు కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు. తెరాస కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా. రాబోయే రోజుల్లో హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తా. ఎన్నికల్లో నైతిక విజయం తెరాస పార్టీదే. తెరాస ఓటమి కోసం రెండు జాతీయ పార్టీలు ఏకమయ్యాయి. ఈటల గెలుపు కోసం కాగ్రెస్‌ అభ్యర్థిని బలి పశువును చేశారు. ఓడిపోతే కుంగిపోమే.. గెలిస్తే పొంగిపోము. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజం. తెరాసను ప్రజలు ఆదరిస్తారని విశ్వాసం ఉంది. 2023లో హుజూరాబాద్‌ గడ్డపై గులాబీ జెండా ఎగురుతుంది. హుజూరాబాద్‌లో గెలిచిన ఈటలకు శుభాకాంక్షలు’’ అని గెల్లు శ్రీనివాస్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని