నిరూపిస్తే రాజీనామా చేస్తా: ఆర్కే

రాజధాని అమరావతి ప్రాంతం నీరుకొండలో తనకు 5 ఎకరాల భూమి ఉన్నట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సవాల్‌ విసిరారు. తాడేపల్లిలో ఏర్పాటు

Published : 03 Jan 2020 10:57 IST

తాడేపల్లి: రాజధాని అమరావతి ప్రాంతం నీరుకొండలో తనకు 5 ఎకరాల భూమి ఉన్నట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సవాల్‌ విసిరారు. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్కే మాట్లాడుతూ...తన భార్య పేరిట ఐదెకరాల భూమి ఉందని నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. వెంటనే ఆభూమిని వారికే రిజిస్ట్రేషన్ చేస్తానన్నారు. తెదేపా నేత బోండా ఉమా చేసిన ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. చంద్రబాబే రాజధానికి శాపమని ఆరోపించారు. ఐదేళ్లలో చంద్రబాబు ఒక్క శాశ్వత భవనం కూడా కట్టలేదన్నారు. భూములిచ్చిన రైతులకు ప్లాట్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని