వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఏడుగురు భాజపా దిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్ధులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ..అంటూ ఆమ్‌ ఆద్మీ పార్టీ ట్వీట్‌ చేసింది.

Published : 04 Jan 2020 00:44 IST

దిల్లీ ముఖ్యమంత్రి పదవికి ఏడుగురు భాజపా అభ్యర్ధులు?

ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎందుకలా ట్వీట్‌ చేసిందంటే...

దిల్లీ: ‘ఏడుగురు భారతీయ జనతా పార్టీ (భాజపా) ముఖ్యమంత్రి అభ్యర్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు..’ అంటూ ఆమ్‌ ఆద్మీ పార్టీ ట్వీట్‌ చేసి ఆ పార్టీపై విమర్శలు గుప్పించింది. ఏడుగురు భాజపా దిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థులైన గౌతమ్‌ గంభీర్‌, మనోజ్‌ తివారీ, విజయ్‌ గోయల్‌, హర్దీప్‌ సింగ్‌ పూరీ, హర్షవర్ధన్‌, విజేందర్‌ గుప్తా, పర్వేష్‌ సింగ్‌లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అని ఉన్న ఒక పోస్టర్‌ను తమ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ఆపై.. అరవింద్‌ కేజ్రీవాల్‌పై పోటీ చేసేదెవరు అనేదే అసలు ప్రశ్న.. అంటూ పేర్కొంది. 

దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆమ్‌ఆద్మీ పార్టీ, భాజపాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అసలు భాజపాలో సరైన ముఖ్యమంత్రి అభ్యర్థే లేరంటూ ఆప్‌ ఎద్దేవా చేసింది. ఈ నేపథ్యంలో ఏడుగురు భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థులకు శుభాకాంక్షలు అంటూ వారి పేర్లతో ఉన్న పోస్టర్‌ ఒకటి దిల్లీలో దర్శనమిచ్చింది. ఇక ఆమ్‌ ఆద్మీ పార్టీ దీనిని ఉపయోగించుకుని వ్యంగ్య వ్యాఖ్యలు జోడిస్తూ ఆ పోస్టర్‌ను తమ అధికారిక ట్విటర్‌ ఖాతాలో పెట్టింది. అయితే ఆ పోస్టర్‌ ఎక్కడ ఉన్నది మాత్రం వెల్లడించలేదు. కాగా దిల్లీ భాజపా ఎన్నికల ఇన్‌ఛార్జ్‌ అయిన కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ తమ పార్టీ  ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందంటూ తెలిపారు.

 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని