జగన్ నివాసం బినామీ పేరుతో కట్టిందే: వర్ల
తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారిక నివాసం బినామీల పేరుతో కట్టారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. జగన్ కష్టార్జితంతో...
విజయవాడ: తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారిక నివాసం బినామీల పేరుతో కట్టారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. జగన్ కష్టార్జితంతో ఆ ఇల్లు కట్టారని వైకాపా నేతలు చెప్పగలరా? అని ఆయన నిలదీశారు. ఇంటి మరమ్మతుల కోసం రూ.42కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ.. అలాంటి వాళ్లా.. అవినీతి నిరోధక శాఖను మందలించేది? అని వర్ల ప్రశ్నించారు. ప్రభుత్వాధికారులు జాగ్రత్తగా ఉండకపోతే భవిష్యత్లో న్యాయస్థానంలో నిల్చోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
విజయవాడలో మీడియాతో వర్ల మాట్లాడుతూ.. సరస్వతి పవర్ ప్రాజెక్టు కోసం రూ.5వేల కోట్లు విలువ చేసే 1500 ఎకరాల భూమిని అప్పటి వైఎస్ ప్రభుత్వం కేటాయించిందని గుర్తు చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక జీవో నెంబర్ 109 ద్వారా 1500 ఎకరాలను తిరిగి సరస్వతి పవర్కు కేటాయించిందని తెలిపారు. ప్రస్తుతం మైనింగ్ శాఖలో ముఖ్యమంత్రి, ఆయన బంధువుల ఫైల్స్ మాత్రమే క్లియర్ అవుతున్నాయని ఆక్షేపించారు. కుటుంబ ఆస్తులు పెంచుకోవడానికి జీవోలు ఇచ్చే జగన్కు రాజధానిని తరలించే హక్కు ఎవరిచ్చారని వర్ల నిలదీశారు. రాజధాని తరలింపుపై వేసిన కమిటీల నివేదిక రాకముందే వారెలా ప్రకటన చేస్తారని వర్ల రామయ్య నిలదీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.