సమ్మెకు కేసీఆర్ నాయకత్వం వహించాలి:సీపీఐ
ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ఓటేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ రేపటి సార్వత్రిక సమ్మెకు నాయకత్వం వహించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కోరారు. కేంద్రంలో
హైదరాబాద్: ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ఓటేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ రేపటి సార్వత్రిక సమ్మెకు నాయకత్వం వహించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కోరారు. కేంద్రంలో ఎన్ఆర్సీని వ్యతిరేకించిన కేసీఆర్ ఆ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో జరుగుతున్న పోరాటాలను అణచివేస్తూ ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్లో మీడియాతో నారాయణ మాట్లాడారు. దేశ రాజధానిలోని జేఎన్యూలో విద్యార్థులపై గూండాలు దాడి చేయటం బాధాకరమన్నారు. జేఎన్యూ అత్యంత మేధావులను తయారు చేసిన ప్రగతిశీల కర్మాగారమన్నారు. పట్టపగలు దాడి జరిగిందంటే దీని వెనుక కేంద్ర ప్రభుత్వంతోపాటు ఆర్ఎస్ఎస్ ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. ఈ దాడిని సీపీఐ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని నారాయణ డిమాండ్ చేశారు.
ఓటరు జాబితా సిద్ధం కాకుండానే, రిజర్వేషన్లు ఖరారు కాకుండానే ఎన్నికల కమిషన్ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి తప్పుబట్టారు. కేసీఆర్ మెప్పుకోసమే ఎన్నికల కమిషన్ తొందరపాటు నిర్ణయం తీసుకుందని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో కలిసి వచ్చే శక్తులతో ముందుకు వెళ్తామని చాడ స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా