రాష్ట్రమంతా తెరాసకే సానుకూలం: కేసీఆర్
రాష్ట్రమంతా తెరాసకే సానుకూలంగా ఉందని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అన్ని
హైదరాబాద్: రాష్ట్రమంతా తెరాసకే సానుకూలంగా ఉందని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను అభివృద్ధి చేసుకుంటామన్నారు. తెలంగాణ భవన్లో పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం సమావేశమయ్యారు. కౌన్సిలర్, కార్పొరేటర్ అభ్యర్థులకు ఇవ్వాల్సిన ఏ, బీ ఫారాలను ఎమ్మెల్యేలకు కేసీఆర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో అన్ని చోట్లా ఆశావహుల నుంచి తీవ్రపోటీ ఉందన్నారు. టికెట్లు దక్కనివారు నిరాశ పడకుండా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదేనని చెప్పారు. టికెట్లు రానివారికి భవిష్యత్లో నామినేటెడ్ పదవులు, ఇతర అవకాశాలు కల్పిస్తామన్నారు. గ్రామాల్లో ‘పల్లె ప్రగతి’ కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఎమ్మెల్యేలంతా కృషి చేయాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి