రాష్ట్రమంతా తెరాసకే సానుకూలం: కేసీఆర్‌

రాష్ట్రమంతా తెరాసకే సానుకూలంగా ఉందని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ అన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అన్ని

Updated : 09 Jan 2020 19:11 IST

హైదరాబాద్‌: రాష్ట్రమంతా తెరాసకే సానుకూలంగా ఉందని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ అన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను అభివృద్ధి చేసుకుంటామన్నారు. తెలంగాణ భవన్‌లో పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం సమావేశమయ్యారు. కౌన్సిలర్‌, కార్పొరేటర్‌ అభ్యర్థులకు ఇవ్వాల్సిన ఏ, బీ ఫారాలను ఎమ్మెల్యేలకు కేసీఆర్‌ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో అన్ని చోట్లా ఆశావహుల నుంచి తీవ్రపోటీ ఉందన్నారు. టికెట్లు దక్కనివారు నిరాశ పడకుండా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదేనని చెప్పారు. టికెట్లు రానివారికి భవిష్యత్‌లో నామినేటెడ్‌ పదవులు, ఇతర అవకాశాలు కల్పిస్తామన్నారు. గ్రామాల్లో ‘పల్లె ప్రగతి’ కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని చెప్పారు. మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఎమ్మెల్యేలంతా కృషి చేయాలని కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని