భార్య ఆదేశం.. కార్యకర్తలారా మా ఇంటికొద్దు
‘ఎన్సీపీ కార్యకర్తలారా.. నన్ను కలిసేందుకు మా ఇంటికి రాకండి’ అంటున్నారు మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్. అజిత్కు ఇంకా అధికారిక నివాసం కేటాయించలేదు. ప్రస్తుతం ఆయన ఉంటున్న ఇల్లు చిన్నదిగా ఉండటం..
పుణె: ‘ఎన్సీపీ కార్యకర్తలారా.. నన్ను కలిసేందుకు మా ఇంటికి రాకండి’ అంటున్నారు మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్. అజిత్కు ఇంకా అధికారిక నివాసం కేటాయించలేదు. ప్రస్తుతం ఆయన ఉంటున్న ఇల్లు చిన్నదిగా ఉండటం.. తరచూ కార్యకర్తలు రావడంతో అజిత్ భార్య సునేత్ర పవార్ చాలా కోపంగా ఉన్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు.
తన అసెంబ్లీ నియోజకవర్గమైన బారామతిలో జరిగిన ఓ కార్యక్రమానికి అజిత్ శుక్రవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ పార్టీ కార్యకర్తలకు ఓ అభ్యర్థన చేశారు. ‘చాలా ముఖ్యమైన పని ఉంటే తప్ప కార్యకర్తలు నన్ను కలవడానికి ముంబయికి రావొద్దు. నాకు ఇంకా అధికారిక నివాసం కేటాయించలేదు. ప్రస్తుతం నేను ఉంటున్న ఇంట్లో సమావేశం గది లేదు. దీంతో నన్ను కలవడానికి వచ్చే కార్యకర్తలతో డైనింగ్ రూంలో గానీ.. పడకగదిలో గానీ సమావేశమవ్వాల్సి వస్తోంది. పెద్ద ఇల్లు కేటాయిస్తే గానీ ఇక్కడ ఉండనని నా భార్య సునేత్ర స్పష్టంగా చెప్పింది’ అని అజిత్ పవార్ చెప్పుకొచ్చారు.
ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అజిత్ తన నియోజకవర్గానికి రావడం ఇదే తొలిసారి. దీంతో ఎన్సీపీ కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని స్కూళ్లలో మరాఠీ తప్పనిసరి చేసే విషయంపై ప్రభుత్వం పరిశీలనలు చేస్తోందని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని