అమరావతి పరిరక్షణ సమితి ర్యాలీ ప్రారంభం

అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తిరుపతిలో చేపట్టిన ర్యాలీ ప్రారంభమైంది. ర్యాలీలో పాల్గొనేందుకు హైదరాబాద్‌ నుంచి బయల్దేరి వెళ్లిన చంద్రబాబు రేణిగుంట చేరుకొని, అక్కడి నుంచి తిరుపతిలోని...

Updated : 11 Jan 2020 19:19 IST

తిరుపతి: అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తిరుపతిలో చేపట్టిన ర్యాలీ ప్రారంభమైంది. ర్యాలీలో పాల్గొనేందుకు హైదరాబాద్‌ నుంచి బయల్దేరి వెళ్లిన చంద్రబాబు రేణిగుంట చేరుకొని, అక్కడి నుంచి తిరుపతిలోని  పూలే విగ్రహం వద్దకు వెళ్లారు.ఆయనతో పాటు అమరావతి పరిరక్షణ సమితి నేతలు కూడా ఉన్నారు. మరోవైపు, ఈ ర్యాలీకి పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. కృష్ణాపురం ఠానా వరకు ర్యాలీ చేసుకుంటే  తమకెలాంటి అభ్యంతరమూ లేదని పోలీసులు చెబుతుండగా.. నేతలు మాత్రం నాలుగు కాళ్ల మండపం వరకు చేపడతామని స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని