నోరుజారిన భాజపా నేత.. కేంద్రమంత్రి ఫైర్
తరచూ వివాదాల్లో నిలిచే పశ్చిమబెంగాల్ భాజపా అధ్యక్షుడు దిలీప్ ఘోష్ మరోసారి వార్తల్లోకెక్కారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే వారిని కాల్చిపారేయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు
కోల్కతా: తరచూ వివాదాల్లో నిలిచే పశ్చిమబెంగాల్ భాజపా అధ్యక్షుడు దిలీప్ ఘోష్ మరోసారి వార్తల్లోకెక్కారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే వారిని కాల్చిపారేయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా.. ఘోష్ వ్యాఖ్యలపై సొంత పార్టీ నుంచే విమర్శలు ఎదురయ్యాయి. ఆయన చాలా బాధ్యతారహితంగా మాట్లాడారంటూ కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో తీవ్రంగా మండిపడ్డారు. అసలేం జరిగిందంటే..
ఆదివారం నదియా జిల్లాలోని ఓ బహిరంగ సభలో ప్రసంగించిన దిలీప్ ఘోష్.. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. నిరసనల పేరుతో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్న వారిని ఉత్తరప్రదేశ్ తరహాలో కాల్చిపారేయాలని అన్నారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించేవారిపై మమతాబెనర్జీ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడానికి అవేమైనా వారి తండ్రుల నుంచి వచ్చిన ఆస్తులా అని ప్రశ్నించారు. జాతి వ్యతిరేక శక్తులపై యూపీ, అసోం, కర్ణాటక ప్రభుత్వాలు కాల్పులు జరిపి మంచిపని చేశాయని, బెంగాల్ ప్రభుత్వం కూడా అలాంటి చర్యలే తీసుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఘోష్ వ్యాఖ్యలపై పెను దుమారం రేగింది. భాజపా అధ్యక్షుడు ఉపయోగించిన భాష ఏమాత్రం సమర్థనీయం కాదంటూ కాంగ్రెస్ నేత దినేశ్ గుండు రావు దుయ్యబట్టారు. అటు సొంత పార్టీ నేతల నుంచి కూడా ఘోష్ విమర్శలు ఎదుర్కొన్నారు. ‘దిలీప్ ఘోష్ వ్యాఖ్యలు బాధ్యతారహితం. దీనికి పార్టీతో ఎలాంటి సంబంధం లేదు. అవి కేవలం ఆయన ఊహాజనిత అభిప్రాయాలు మాత్రమే. యూపీ, అసోంలలో భాజపా ప్రభుత్వాలు ఏ కారణం చేతనైనా సరే ప్రజలపై కాల్పులు జరపలేదు’ అని బాబుల్ సుప్రియో ట్విటర్ వేదికగా స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
కాంగ్రెస్ నేత, ఛింద్వాడా సిట్టింగ్ ఎంపీ నకుల్ నాథ్ ఇటీవల నామినేషన్ వేసిన సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. -
పదేళ్ల ‘రిపోర్టు కార్డ్’ చూపించండి.. స్మృతి ఇరానీకి కాంగ్రెస్ ప్రశ్న
మహిళలకు సంబంధించిన సమస్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మౌనంగా ఉంటున్నారని.. గడిచిన పదేళ్లలో ‘రిపోర్టు కార్డు’ను బయటపెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముక్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్