
Published : 13 Jan 2020 13:40 IST
బస్తీ మే సవాల్: జేసీ
వైకాపా కార్యకర్తలకు హెచ్చరిక
అనంతపురం: రాజధాని పరిరక్షణ యాత్రలో భాగంగా చంద్రబాబు అనంతపురం పర్యటనలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పాలసముద్రం వద్ద జోలె పట్టి చంద్రబాబు విరాళాలు సేకరిస్తుండగా.. వైకాపా కార్యకర్తలు ఆయన కాన్వాయ్కు అడ్డుపడ్డారు. దీంతో ఆ పార్టీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్రెడ్డి బస్సు దిగి ‘బస్తీ మే సవాల్’ అంటూ వారిని హెచ్చరించారు. పోలీసులు కలగజేసుకొని పరిస్థితిని చక్కదిద్దారు. కొడికొండ చెక్పోస్టు నుంచి ప్రారంభమైన చంద్రబాబు ర్యాలీ మరికాసేపట్లో పెనుకొండకు చేరుకోనుంది. అక్కడ ఏర్పాటు చేసిన రోడ్షోలో పాల్గొంటారు. ఇవాళ సాయంత్రం అనంతపురంలో పండ్లు, టీ విక్రయించి చంద్రబాబు నిధులు సేకరించనున్నారు.
Tags :