బస్తీ మే సవాల్: జేసీ

రాజధాని పరిరక్షణ యాత్రలో భాగంగా చంద్రబాబు అనంతపురం పర్యటనలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పాలసముద్రం వద్ద జోలె పట్టి చంద్రబాబు విరాళాలు సేకరిస్తుండగా.. వైకాపా కార్యకర్తలు ఆయన కాన్వాయ్‌కు అడ్డుపడ్డారు. దీంతో ఆ పార్టీ సీనియర్‌

Published : 13 Jan 2020 13:40 IST

వైకాపా కార్యకర్తలకు హెచ్చరిక


 

అనంతపురం: రాజధాని పరిరక్షణ యాత్రలో భాగంగా చంద్రబాబు అనంతపురం పర్యటనలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పాలసముద్రం వద్ద జోలె పట్టి చంద్రబాబు విరాళాలు సేకరిస్తుండగా.. వైకాపా కార్యకర్తలు ఆయన కాన్వాయ్‌కు అడ్డుపడ్డారు. దీంతో ఆ పార్టీ సీనియర్‌ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి బస్సు దిగి ‘బస్తీ మే సవాల్‌’ అంటూ వారిని హెచ్చరించారు. పోలీసులు కలగజేసుకొని పరిస్థితిని చక్కదిద్దారు. కొడికొండ చెక్‌పోస్టు నుంచి ప్రారంభమైన చంద్రబాబు ర్యాలీ మరికాసేపట్లో పెనుకొండకు చేరుకోనుంది. అక్కడ ఏర్పాటు చేసిన రోడ్‌షోలో పాల్గొంటారు. ఇవాళ సాయంత్రం అనంతపురంలో పండ్లు, టీ విక్రయించి చంద్రబాబు నిధులు సేకరించనున్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని