క్రేజీగా కేజ్రివాల్ ప్రచారం
ఇటీవల సోషల్ మీడియా.. రాజకీయాలను విపరీతంగా ప్రభావితం చేస్తోంది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాలు పాత్ర పోషించాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల సోషల్ మీడియా.. రాజకీయాలను విపరీతంగా ప్రభావితం చేస్తోంది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాలు పాత్ర పోషించాయి. అందుకే ఆయా పార్టీలతో నాయకులంతా సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటున్నారు. ఇదంతా ఇప్పుడెందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. ఇటీవల దిల్లీలో శాసనసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 70 శాసనసభ స్థానాలకు ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)తో పాటు కాంగ్రెస్, భాజపా ఎన్నికల్లో విజయం సాధించి దిల్లీ పీఠంపై కూర్చోవాలని తీవ్రంగా చెమటోడుస్తున్నాయి.
కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ అయితే మరింత చురుగ్గా వ్యవహరిస్తోంది. సామాజిక మాధ్యమాలను ప్రచారానికి వాడుకోవడంతోనే ఆగిపోకుండా ఒకడుగు ముందుకేసి ‘మెమ్స్’ తయారు చేస్తోంది. మెమ్స్ అంటే ఒక రకమైన స్పూఫ్. సందర్భానికి తగ్గట్లు ప్రముఖుల ఫొటోలు జతచేసి తమ అభిప్రాయం చెప్పేస్తుంటారు. వీటిపై యువత ఎక్కువగా ఆసక్తి కనబరుస్తుంటారు. అందుకే ఆప్ సైతం మెమ్స్ మంత్రం పటిస్తోంది. ప్రధాన ప్రత్యర్థులైన భాజపా, కాంగ్రెస్ను లక్ష్యంగా చేసుకొని వాళ్ల లోపాలను ఎత్తి చూపుతూ.. ఆ పార్టీలపై వ్యంగ్యాస్త్రాలు విసురుతోంది. ఇందుకు ట్విటర్, ఫేస్బుక్ను ప్రధాన వేదికగా చేసుకుంది. ఆప్ ట్విటర్ వేదికగా వేసిన మెమ్స్లో కొన్ని..
భాజపా పాలిత ప్రాంతాల్లో అవినీతి గురించి చదివేటప్పుడు ఓ భాజపా నేత రియాక్షన్ ఇలా ఉంటుందని ఆప్ ఇలా పోస్టు చేసింది. |
దిల్లీ పీఠంపై ఎంతమంది కన్నేసినా మళ్లీ కేజ్రివాల్కే దక్కుందని చెప్పేందుకు.. ఈ పోస్టు.. |
దిల్లీలో భాజపా తరఫున సరైన సీఎం అభ్యర్థి లేరని చెప్పే ప్రయత్నం ఇది.. |
దిల్లీలో కేజ్రివాల్పై పోటీ చేసేందుకు అభ్యర్థులు భయపడుతున్నారని చెప్పే మెమ్.. |
ఇదిలా ఉండగా.. ఈ ప్రచారంతో కొంతమంది యువతగా ఆకర్షితులవుతున్నా.. మరికొంత మంది మాత్రం స్వయంగా ఆప్ నిర్వహిస్తున్న సొంత ఖాతాలోనే ఇలాంటి వ్యంగ్యపు పోస్టులు పెట్టడం ఎంత వరకు కరెక్టని ప్రశ్నిస్తున్నారు. బాధ్యత గల ప్రజాప్రతినిధులు, నాయకులు ఇలాంటి దిగజారుడు చర్యలకు పాల్పడటం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య కీలక నిర్ణయం తీసుకున్నారు. -
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను జైపుర్లో జరిగే బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ విడుదల చేయనుంది. -
పదేళ్ల ‘రిపోర్టు కార్డ్’ చూపించండి.. స్మృతి ఇరానీకి కాంగ్రెస్ ప్రశ్న
మహిళలకు సంబంధించిన సమస్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మౌనంగా ఉంటున్నారని.. గడిచిన పదేళ్లలో ‘రిపోర్టు కార్డు’ను బయటపెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. -
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
కాంగ్రెస్ నేత, ఛింద్వాడా సిట్టింగ్ ఎంపీ నకుల్ నాథ్ ఇటీవల నామినేషన్ వేసిన సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. -
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
రాయలసీమ ద్రోహి ఎవరో ప్రజలే తేల్చాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
భారతదేశపు సంపన్న మహిళ సావిత్రి జిందాల్ (Savitri Jindal), బిజేడీ నుంచి 6 సార్లు ఎంపీగా ఎన్నికైన భర్తృహరి భాజపాలో చేరారు. -
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
భారాస ఎంపీ కె.కేశవరావు (కేకే), ఆయన కుమార్తె.. జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లో చేరనున్నారు. -
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
వినాశక వైకాపా ప్రభుత్వం..రాజధాని అమరావతి, అన్నా క్యాంటీన్లు సహా ప్రజల కోసం చంద్రబాబు తీసుకొచ్చిన ప్రతి ఒక్కటీ విధ్వంసం చేసిందని నారా భువనేశ్వరి మండిపడ్డారు. -
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
బాలీవుడ్ నటుడు గోవిందా శివసేన (శిందే వర్గం) పార్టీలో చేరారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పోటీ చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. -
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
కాంగ్రెస్ కంచుకోట కోలార్లో అసమ్మతి భగ్గుమంటోంది. ఈ స్థానానికి వారసత్వంగా సీటు కేటాయిస్తే రాజీనామాలు చేస్తామని పార్టీ సీనియర్ నేతల నుంచి ధిక్కారస్వరం వినిపిస్తోంది. -
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. -
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
తాను ఎక్కడున్నా ఓ కన్ను కొడంగల్పైనే ఉంటుందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
భూమా అఖిలప్రియను అడ్డుకున్న వైకాపా నేతలు.. యర్రగుంట్లలో ఉద్రిక్తత
మాజీ మంత్రి, ఆళ్లగడ్డ తెదేపా అభ్యర్థి భూమా అఖిలప్రియను వైకాపా నేతలు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
వైకాపా ప్రభుత్వం పని అయిపోయిందని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు ఎన్డీయే కూటమికి మద్దతివ్వాలని కోరారు. -
కేసీఆర్ ఎవరినీ నమ్మలేదు.. అందుకే ఫోన్ ట్యాపింగ్: భాజపా ఎంపీ లక్ష్మణ్
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు భారాసను ఓడించి శిక్ష విధించినా ఆ పార్టీ నేతలు అహంకారాన్ని వీడటం లేదని భాజపా ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. -
కొనసాగుతున్న మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు. -
కంగనపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సుప్రియా శ్రీనేత్కు కాంగ్రెస్ షాక్!
Congress: కంగనా రనౌత్పై కాంగ్రెస్ నేత సుప్రియ శ్రీనేత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో ఆమెను పార్టీ తాజా లోక్సభ అభ్యర్థుల జాబితా నుంచి తప్పించింది. -
ఇంటికి కిలో బంగారం పంచినా జగన్కు ఓటమే
అయిదేళ్ల అరాచక పాలనతో విసిగిన జనం.. జగన్ను తాడేపల్లి ప్యాలెస్లో శాశ్వతంగా బంధించేందుకు నిర్ణయించుకున్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. -
నగదు, మద్యం దొరికినా అధికారులు స్పందించరేం?
తిరుపతి సమీపంలోని రేణిగుంట వద్ద వైకాపా నేతలకు చెందిన మద్యం, నగదు, ప్రచార సామగ్రి డంప్లు దొరికినా.. జిల్లా కలెక్టర్, ఆర్వోలు చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏంటని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. -
ప్రకాశం ఇనుప ఖనిజాన్ని విశాఖ ఉక్కుకు కేటాయించాలి: సీపీఎం
ప్రకాశం జిల్లా యర్రజర్లకొండ ఇనుప ఖనిజాన్ని విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనుల కింద కేటాయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు లేఖ రాశారు. -
రాయలసీమ ద్రోహిని అడ్డుకోండి
యాత్రపేరుతో పరదాల చాటు నుంచి ముసుగువీరుడు బయటకొచ్చారని... ‘జగన్ నువ్వు రాయలసీమ ద్రోహివి.. ఇక్కడికి రావడానికి వీల్లేదు’ అని జనం గట్టిగా చెప్పాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్