బి-ఫారం ఇవ్వలేదని అభ్యర్థి ఆత్మహత్యాయత్నం

తెరాస బి-ఫారం ఇవ్వలేదని ఓ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ ఘటన మేడ్చల్‌లో చోటుచేసుకుంది. మేడ్చల్‌లో 14వ వార్డుకు విజయ్‌ అనే వ్యక్తి నామినేషన్‌ వేశాడు. అయితే తనకు తెరాస బి-ఫారం ఇస్తుందని నమ్మకం పెట్టుకున్నాడు. అయితే చివరికి

Updated : 14 Jan 2020 18:14 IST

మేడ్చల్‌ : తెరాస బి-ఫారం ఇవ్వలేదని ఓ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన మేడ్చల్‌లో చోటుచేసుకుంది. మేడ్చల్‌లో 14వ వార్డుకు విజయ్‌ అనే వ్యక్తి నామినేషన్‌ వేశాడు. అయితే తనకు తెరాస బి-ఫారం ఇస్తుందని నమ్మకం పెట్టుకున్నాడు. అయితే చివరికి వేరే అభ్యర్థికి బి-ఫారం ఇవ్వడంతో మనస్తాపానికి గురయ్యాడు. పట్టణంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్దకు ఈ ఉదయం చేరుకొని కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. అతడి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని