బెదిరింపులకు దిగితే సహించేది లేదు: లక్ష్మణ్‌

 తెరాస నేతలు బెదిరింపులకు దిగితే సహించేది లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. భాజపా ఎన్నికల ప్రచారానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. శుక్రవారం భూత్పూర్‌ పురపాలిక ఎన్నికల ప్రచారంలో లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

Updated : 17 Jan 2020 12:32 IST

భూత్పూర్‌:  తెరాస నేతలు బెదిరింపులకు దిగితే సహించేది లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. భాజపా ఎన్నికల ప్రచారానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. శుక్రవారం భూత్పూర్‌ పురపాలిక ఎన్నికల ప్రచారంలో లక్ష్మణ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెరాస ప్రభుత్వం మాటలకే పరిమితమైపోయిందని విమర్శించారు. తెరాస పార్టీ అన్ని విషయాల్లోనూ ఎంఐఎంను వెనకేసుకొస్తోందన్నారు. రాష్ట్రంలో రైతు రుణమాఫీ, రైతుబంధు పథకాలు అమలుకావడం లేదని చెప్పారు. ఈ ప్రచారంలో భాజపా నేతలు డీకే అరుణ, జితేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని