‘మేం గెలిస్తే నిజామాబాద్ పేరు మార్చేస్తాం’
నిజామాబాద్ మేయర్ పీఠంపై ఎంఐఎంను కూర్చోబెట్టేందుకు తెరాస ప్రయత్నిస్తోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. భాజపా జిల్లా కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన ఆయన మీడియాతో...
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్
నిజామాబాద్: నిజామాబాద్ మేయర్ పీఠంపై ఎంఐఎంను కూర్చోబెట్టేందుకు తెరాస ప్రయత్నిస్తోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. భాజపా జిల్లా కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పురపాలక ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులు పోటీలో ఉన్న డివిజన్లలో తెరాస డమ్మీ అభ్యర్థులను నిలబెట్టిందని ఆరోపించారు. మంత్రి కేటీఆర్ రాజకీయ నిరక్షరాస్యుడిలా మాట్లాడుతున్నారని.. మోదీ, అమిత్ షాలను విమర్శించే అర్హత ఆయనకు లేదని వ్యాఖ్యానించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని తెలంగాణలో అమలు చేయబోమని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నిజామాబాద్ కార్పొరేషన్ను భాజపా కైవసం చేసుకుంటుందని.. గెలిచిన తర్వాత నిజామాబాద్ పేరును ఇందూరుగా మారుస్తూ మొదటి తీర్మానం చేయనున్నట్లు ఎంపీ అర్వింద్ స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
పోరాడిన గుజరాత్.. ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ