కేంద్రం జోక్యం చేసుకుంటుంది: సుజనా
వైకాపా ప్రభుత్వం మూడు రాజధానులపై ముందుకెళ్తే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని భాజపా ఎంపీ సుజనాచౌదరి స్పష్టం చేశారు. శనివారం దిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... సీఎంలు మారినప్పుడల్లా రాజధాని మారుతుందా
దిల్లీ: వైకాపా ప్రభుత్వం మూడు రాజధానులపై ముందుకెళ్తే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని భాజపా ఎంపీ సుజనాచౌదరి స్పష్టం చేశారు. శనివారం దిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... సీఎంలు మారినప్పుడల్లా రాజధాని మారుతుందా అని ప్రశ్నించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే ఎవరూ ఊరుకోరని అన్నారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం మంచిపద్ధతి కాదన్నారు. అధికారంలో ఎవరు ఉంటే వారికి అనుగుణంగా అధికారులు పనిచేయడం సరికాదన్నారు. ఎయిమ్స్, నిఫ్ట్ వంటి అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు వచ్చాయని తెలిపారు. హైకోర్టు, సచివాలయం, రాజ్భవన్ వంటివి ఒకే చోట ఉండాలని విభజన చట్టం సెక్షన్-6లో స్పష్టంగా ఉందన్నారు. ఇకనైనా వైకాపా ప్రభుత్వం పరిపాలనపై దృష్టిపెట్టాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రాజధాని మారిస్తే చూస్తూ ఊరుకోమని, రాష్ట్ర ప్రజల తరఫున పోరాడతామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో జోక్యం చేసుకుంటుందని సుజనాచౌదరి తెలిపారు.
అందరూ వ్యతిరేకించాలి...
‘‘అమరావతి తరలింపుపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరగుతున్నాయి. కొందరు రైతులు ఆందోళనతో చనిపోయారు. అమరావతి తరలింపును అందరూ వ్యతిరేకించాలి. సీఆర్డీఏను తొలగించేందుకు ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోంది. రాజు మారినప్పుడల్లా రాజధానిని మారుస్తూ ప్రజాధనాన్ని వృథా చేస్తే కోర్టులు జోక్యం చేసుకునే అవకాశం ఉంది. గతంలో ఇచ్చిన తీర్పులే ఇందుకు ఉదాహరణ. రాజధాని తరలింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని 13 జిల్లాలను ఏవిధంగా అభివృద్ధి చేయాలనే దానిపై ఆలోచిస్తే మంచిది. మనీ బిల్లుగా సీఆర్డీఏని తీసుకొస్తామంటే అయ్యే పనికాదు. అమరావతిలో పరిణామాలను కేంద్రం పరిశీలిస్తోంది. అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత కేంద్రం జోక్యం చేసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో వైకాపా ప్రజాప్రతినిధులే సంతోషంగా లేరు. సీఎం పదవిలో ఎవరు ఉన్నా ప్రజాస్వామ్య పద్ధతిలోనే వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రభుత్వాన్ని నమ్మి రైతులు భూములు ఇచ్చారు. రాజధాని ఒక్క అంగుళం కూడా జరగదు. అమరావతి తరలింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతినే పరిస్థితి తలెత్తుతుంది. ఉత్తరాంధ్ర కూడా అభివృద్ధి చెందాలి, అందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’’ అని సుజనా చౌదరి అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?