నలుగురు తెరాస నేతల సస్పెన్షన్‌

సూర్యాపేట పురపాలిక ఎన్నికల్లో పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తూ స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో నిలిచిన నలుగురు తెరాస నాయకులను ఆ పార్టీ శనివారం సస్పెండ్‌ చేసింది. గునగంటి వంశీ, గండూరి రమేష్‌...

Published : 18 Jan 2020 16:21 IST

తాళ్లగడ్డ (సూర్యాపేట): సూర్యాపేట పురపాలిక ఎన్నికల్లో పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తూ స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో నిలిచిన నలుగురు తెరాస నాయకులను ఆ పార్టీ శనివారం సస్పెండ్‌ చేసింది. గునగంటి వంశీ, గండూరి రమేష్‌, కందుల రమేష్‌, రాజేందర్‌పై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. ఈ మేరకు తెరాస పార్టీ పట్టణ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరంతా  పురపాలిక ఎన్నికల్లో తెరాస తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని