‘డమ్మీ కాన్వాయ్తో ట్రయల్ రన్..సిగ్గుచేటు’
హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పెరిగే విధంగా తెలంగాణ సీఎం కేసీఆర్తో ఏపీ సీఎం జగన్ ఒప్పందం చేసుకున్నారని.. అందుకే అమరావతిని చంపేస్తున్నారని...
సీఎం జగన్పై దేవినేని ఉమ ధ్వజం
అమరావతి: హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పెరిగే విధంగా తెలంగాణ సీఎం కేసీఆర్తో ఏపీ సీఎం జగన్ ఒప్పందం చేసుకున్నారని.. అందుకే అమరావతిని చంపేస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. పాము తన పిల్లల్ని తానే చంపుకున్నట్లుగా జగన్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పులివెందుల పులి డమ్మీ కాన్వాయ్తో ట్రయల్ రన్ నిర్వహించుకోవడం సిగ్గు చేటని ఆయన ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో దేవినేని మాట్లాడారు.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోనూ లేని బలగాలను అమరావతి ప్రాంతంలో మోహరిస్తున్నారని మండిపడ్డారు. తప్పు చేస్తున్నారు కాబట్టే సీఎం జగన్ ఇంతలా భయపడుతున్నారన్నారు. 10వేల మంది పోలీసుల బందోబస్తుతో అసెంబ్లీ నిర్వహించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని నిలదీశారు. విశాఖలో ప్రజాబ్యాలెట్ను ప్రభుత్వం అడ్డుకుందని దేవినేని ఉమ ఆరోపించారు. అక్కడ 52వేల ఎకరాలు చేతులు మారాయని.. వీటన్నింటినీ అమ్ముకోవడానికే జగన్ రాజధానిని తరలిస్తున్నారని ఆరోపించారు. మూడు రాజధానులకు కృష్ణా జిల్లా వైకాపా నేతలు మద్దతు పలకడం సిగ్గుమాలిన చర్యగా దేవినేని అభివర్ణించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం