దిల్లీ ఫైట్కు జేజేపీ దూరం
దేశ రాజధానిలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు భాజపా మరో మిత్రపక్షం దూరంగా ఉంటోంది. హరియాణాలో భాజపాతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) దిల్లీ శాసనసభ
దిల్లీ: దేశ రాజధానిలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు భాజపా మరో మిత్రపక్షం దూరంగా ఉంటోంది. హరియాణాలో భాజపాతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) దిల్లీ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయట్లేదని ప్రకటించింది. జేజేపీ ఎంపిక చేసుకున్న గుర్తును ఎన్నికల సంఘం మరొకరికి కేటాయించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ అధినేత దుశ్యంత్ చౌటాలా వెల్లడించారు.
‘పార్టీకి ఎన్నికల గుర్తు అనేది చాలా ముఖ్యమైన అంశం. ఇంత తక్కువ సమయంలో కొత్త గుర్తుపై పోటీ చేసేందుకు మేం ఆసక్తిగా లేం. అందుకే ఎన్నికల బరిలో మా పార్టీ నుంచి అభ్యర్థులను బరిలోకి దింపట్లేదు’ అని దుశ్యంత్ చౌటాలా మంగళవారం వెల్లడించారు. దిల్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ‘తాళం’ లేదా ‘చెప్పు’ గుర్తు కేటాయించాలని జేజేపీ ఎన్నికల కమిషన్ను కోరింది. అయితే ఈ రెండు గుర్తులను ఈసీ వేరే వారికి కేటాయించింది.
ఇప్పటికే భాజపా మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్(ఎస్ఏడీ) దిల్లీ ఎన్నికలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. పౌరసత్వ చట్టం, సీట్ల పంపకాల విషయంలో భాజపా, శిరోమణి అకాలీదళ్ మధ్య భేదాభిప్రాయాలు తలెత్తడంతో తాము ఎన్నికల్లో పోటీ చేయట్లేదని ఎస్ఏడీ నిన్న ప్రకటించింది. ఈ ప్రకటన చేసిన 24 గంటల్లోపే భాజపా మరో మిత్రపక్ష పార్టీ అయిన జేజేపీ కూడా అసెంబ్లీ ఎన్నికలకు దూరమవుతున్నట్లు ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
దిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా.. భాజపా 67 స్థానాల్లో ప్రత్యక్షంగా పోటీకి దిగింది. మిగతా మూడు స్థానాలను తమ మిత్రపక్షాలకు వదిలేసింది. రామ్ విలాస్ పాసవాన్కు చెందిన లోక్ జనశక్తి పార్టీ, నితీశ్ కుమార్కు చెందిన జేడీయూకు టికెట్లు ఆఫర్ చేసినట్లు భాజపా దిల్లీ అధ్యక్షుడు మనోజ్ తివారీ ఇటీవల వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్