మండలిలో వికేంద్రీకరణ బిల్లుపై వాడీవేడి చర్చ
శాసన మండలిలో రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై చర్చ కొనసాగుతోంది. సభలో మాట్లాడేందుకు మండలి ఛైర్మన్... తెదేపా సభ్యులకు 84 నిమిషాలు, తెదేపా
అమరావతి: శాసన మండలిలో రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై చర్చ కొనసాగుతోంది. సభలో మాట్లాడేందుకు మండలి ఛైర్మన్... తెదేపా సభ్యులకు 84 నిమిషాలు, తెదేపా నామినేటెడ్ సభ్యులకు 8 నిమిషాలు, వైకాపా సభ్యులకు 27 నిమిషాలు, స్వతంత్ర సభ్యులకు 9 నిమిషాల సమయం కేటాయించారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ... ‘‘అమరావతిలో సీఎం ఒక్క రోజు కూడా పర్యటించలేదు. దాదాపు అన్ని భవనాల నిర్మాణం పూర్తయింది. రాజధాని తరలిస్తే అమరావతిలో పెట్టిన ప్రజాధనం వృథా అవుతుంది. అన్ని ఆఫీసులు ఒకే దగ్గర ఉండాలని కేంద్రం చెబుతోంది. దక్షిణాఫ్రికాలో తప్ప ఎక్కడా మూడు రాజధానులు లేవు. మూడు రాజధానులతో ప్రజా ధనం వృథా అవుతుందని ఆదేశ అధ్యక్షుడే చెప్పారు’’ అని లోకేశ్ తెలిపారు.
మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ... చంద్రబాబు, లోకేశ్ ఎప్పడూ సింగపూర్, చైనా అమెరికా అన్నారు. మేం మాత్రం వెనుకబడిన ప్రాంతాల గురించే ఆలోచిస్తాం. అమరావతిలో తెదేపా నేతల భూ దోపిడీకి అంతే లేదు’’ అని విమర్శించారు. ఈక్రమంలో అవంతి ప్రసంగానికి తెదేపా ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ అడ్డుతగిలారు. సీఎంను తుగ్లక్ అనడం సంస్కారమా అని అవంతి ప్రశ్నించారు. దీంతో ఇరువురి మధ్య కొద్దిసేపు మాటల యుద్ధం కొనసాగింది. మండలిలో సెల్ఫోన్ చూస్తూ లోకేశ్ మాట్లాడటంపై మంత్రి బొత్స సత్యనారాయణ అభ్యంతరం తెలిపారు. పరిశీలించి రూలింగ్ ఇవ్వాలని మండలి వైస్ ఛైర్మన్ను కోరారు. దీనిపై పీడీఎఫ్ ఎమ్మెల్సీ బాలసుబ్రమణ్యం స్పందిస్తూ.. మండలిలో వైఫై సౌకర్యం ఉందని, సెల్ఫోన్లో నోట్స్ చూస్తూ మాట్లాడేతే తప్పేముందన్నారు. అనంతరం లోకేశ్ తన ప్రసంగం కొనసాగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?