మండలి పరిణామాలు బాధించాయి:జగన్
శాసన మండలిలో జరిగిన పరిణామాలు తనను ఎంతగానో బాధించాయని సీఎం జగన్ అన్నారు. మండలి చట్టసభలో భాగమైనందున చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా వ్యవహరిస్తుందని నమ్మాం అని చెప్పారు. కానీ తనతో పాటు ఐదు కోట్ల ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ మండలిలో జరిగిన...
అమరావతి: శాసన మండలిలో జరిగిన పరిణామాలు తనను ఎంతగానో బాధించాయని సీఎం జగన్ అన్నారు. మండలి చట్టసభలో భాగమైనందున చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా వ్యవహరిస్తుందని నమ్మాం అని చెప్పారు. కానీ తనతో పాటు ఐదు కోట్ల ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ మండలిలో జరిగిన తంతును అందరమూ చూశామన్నారు. మండలిలో బుధవారం జరిగిన పరిణామాలపై శాసనసభలో జరిగిన చర్చలో సీఎం మాట్లాడారు. ‘‘గ్యాలరీల్లో తెదేపా అధినేత చంద్రబాబు కూర్చొని జారీ చేసిన ఆదేశాలు చూస్తే మండలి ఛైర్మన్ నిష్పాక్షికంగా మండలి నిర్వహించే పరిస్థితి లేదని సభ చూసిన ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది’’ అని జగన్ వ్యాఖ్యానించారు.
అలా చేస్తే ప్రజాస్వామ్యానికి విలువ ఉండదు
‘‘మండలి ఛైర్మన్ ఎలాంటి ప్రసంగం చేశారో రాష్ట్ర ప్రజలంతా చూడాల్సిన అవసరముంది. అన్ని ప్రాంతాల అభివృద్ధికి, పరిపాలన వికేంద్రీకరణకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులను మండలి ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. అలా కానిపక్షంలో సభ అభిప్రాయాలను సవరణలతో తిప్పి పంపించవచ్చు. చట్టం చెబుతున్నది కూడా ఇదే. కానీ ఇవేమీ లెక్క చేయకుండా విచక్షణాధికారమని ఛైర్మన్ మాట్లాడారు. నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. సెలెక్ట్ కమిటీకి పంపే అవకాశమే లేదని ఆయనే స్వయంగా చెప్పారు. అలాంటిది నిబంధనలకు విరుద్ధంగా ఛైర్మన్ తనకు లేని అధికారాన్ని ఉపయోగించి ఆలస్యం చేయడం కోసం సెలెక్ట్ కమిటీ పంపాలని నిర్ణయం తీసుకున్న విధానం అత్యంత దురదృష్టకరం. ప్రజలకు న్యాయం జరగకుండా ఉండేందుకు శాసన మండలిని వాడుకోవచ్చన్న దురాలోచనను మనం ఆమోదిస్తే ప్రజాస్వామ్యం అనేదానికి విలువ లేకుండా పోతుంది’’ అని సీఎం అన్నారు. ఈ సందర్భంగా బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతూ మండలిలో ఛైర్మన్ షరీఫ్ చేసిన ప్రకటనకు సంబంధించిన వీడియోను సభలో ప్రదర్శించారు.
శాసనమండలి కొనసాగించడంలో ఔచిత్యం లేదు!
ఉన్నత విద్య చదివిన వ్యక్తులు, ఇంజనీర్లు, డాక్టర్లు, విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, జర్నలిస్టులు, విశ్రాంత అఖిల భారత సర్వీసు అధికారులు శాసనసభలో ఉన్నారని సీఎం జగన్ అన్నారు. ఇంత మందిని ఉంచుకుని శాసన మండలిని కొనసాగించటంలో ఔచిత్యం లేదన్నది అందరి భావనని చెప్పారు. ‘‘మండలి కోసం ఏడాదికి రూ.60 కోట్లు ఖర్చు చేస్తున్నాం. పేదరికంలో ఉన్న రాష్ట్రంలో మండలి కోసం ఇంత ఖర్చు చేయాల్సిన అవసరం ఉందా? అన్నది మా ప్రశ్న. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న మండలిని కొనసాగించాల్సిన అవసరముందా? అనే ఆలోచన కూడా ఉత్పన్నమవుతోంది. నిబంధనలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్న మండలి ఇక కొనసాగటం ఎందుకన్న భావన అందరిలోనూ ఉంది’’ అని సీఎం జగన్ అన్నారు.
చంద్రబాబు 10 రోజులు విశాఖలో లేరా..?
తప్పు అని తెలిసినా.. తప్పు చేస్తున్నానని మండలి ఛైర్మన్ వ్యాఖ్యానించారని సీఎం జగన్ అన్నారు. అన్యాయం జరిగిందని అందరికీ అర్థమవుతోందని, ఇంత జరిగినా తెదేపా అధినేత చంద్రబాబు గ్రామాల్లో తిరగటం, ఆయనకు దండలు వేయటం ఆశ్చర్యంగా ఉందని సీఎం వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదని, ‘సీట్ ఆఫ్ గవర్నెన్స్’ అనే పదమే ఉందని ఆయన అసెంబ్లీలో చెప్పారు. ‘‘తుపాను వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు 10 రోజులు విశాఖలో ఉన్నారు. పాలన అక్కడి నుంచే జరిగింది కదా. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడి నుంచే పాలన కొనసాగించే అధికారం ప్రజలిచ్చారు. ముఖ్యమంత్రి, ఆయనకు సహాయకులుగా మంత్రులు, కార్యదర్శులు ఉంటే ఎక్కడి నుంచైనా పాలన చేయొచ్చు. ఇది వాస్తవం. ఓ తీర్మానం ద్వారా ఇది సాధ్యం అవుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 174 ప్రకారం రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పాలన చేయొచ్చు. శాసనసభను కూడా ఎక్కడి నుంచైనా నిర్వహించే వీలుంది. ఇంత వెసులుబాటు ఉన్నా.. ఎందుకు రాజకీయ పార్టీలు నాటకాలు, డ్రామాలు ఆడుతున్నాయో అర్ధం కావటం లేదు’’ అని సీఎం వ్యాఖ్యానించారు.
కొనసాగించాలా? వద్దా? అన్నది ఆలోచించాలి!
దేశంలోని ఆరు రాష్ట్రాల్లో మాత్రమే శాసనమండళ్లు ఉన్నాయని, పాలనాపరమైన సూచనలు ఇచ్చే మేధావులు ఉండేలా శాసనమండళ్లు ఏర్పాటయ్యాయని జగన్ గుర్తు చేశారు. మండలిలో ఆంగ్ల మాధ్యమం బిల్లును కూడా అడ్డుకున్నారని, అలా అడ్డుకున్న వ్యక్తులెవరూ తమ పిల్లల్ని తెలుగు మీడియంలో చదివించడం లేదన్నారు. పేదలు, సామాన్యులకు ఉపయోగపడే బిల్లులను అడ్డుకోవడం వల్ల వారికి ఏమొస్తుందని అసహనం వ్యక్తం చేశారు. పెద్దలు, మేధావులు ప్రభుత్వానికి సలహాలివ్వకుండా..ఇలాంటి రాజకీయాలు చేయటం సరికాదని సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. శాసనసభలో ఆంగ్ల మాధ్యమానికి అనుకూలమని చెప్పిన తెదేపా.. సదరు బిల్లును మండలిలో అడ్డుకుందని సీఎం గుర్తు చేశారు. ఏడాదికి రూ.60 కోట్ల చొప్పున ఐదేళ్లకు రూ.300 కోట్లు ఖర్చు అవుతున్న ఇలాంటి సభలను కొనసాగించాలా? వద్దా? అన్న అంశంపై పునరాలోచన చేయాలన్నారు. సోమవారం మళ్లీ సభను నిర్వహించాలని సభాపతి తమ్మినేని సీతారామ్ను కోరారు. అనంతరం సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
నిర్ణయంపై ఉత్కంఠ..!
మండలిలో జరిగిన పరిణామాల నేపథ్యంలో సీఎం జగన్ శాసనసభలో చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా మండలిని దుర్వియోగం చేస్తున్నారంటూ సీఎం విమర్శలు చేశారు. గత సమావేశాల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులను అడ్డుకున్నారని ఆక్షేపించారు. బుధవారం జరిగిన పరిణామాలపై ఆయన ఒకింత అసహనం, ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా మండలిలో వ్యవహరించారని..ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఇలాంటి సభలను కొనసాగించాల్సిన అవసరముందా?లేదా? అనే అంశంపై ఆలోచించాలని వ్యాఖ్యానించారు. సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో మండలిని రద్దు చేసే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ విధంగానే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఉంటుందా? లేదా? అనే చర్చ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. సభను సోమవారానికి వాయిదా వేసినందున ఆరోజు మండలిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
వినాశక వైకాపా ప్రభుత్వం..రాజధాని అమరావతి, అన్నా క్యాంటీన్లు సహా ప్రజల కోసం చంద్రబాబు తీసుకొచ్చిన ప్రతి ఒక్కటీ విధ్వంసం చేసిందని నారా భువనేశ్వరి మండిపడ్డారు. -
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
బాలీవుడ్ నటుడు గోవిందా శివసేన (శిందే వర్గం) పార్టీలో చేరారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పోటీ చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. -
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
కాంగ్రెస్ కంచుకోట కోలార్లో అసమ్మతి భగ్గుమంటోంది. ఈ స్థానానికి వారసత్వంగా సీటు కేటాయిస్తే రాజీనామాలు చేస్తామని పార్టీ సీనియర్ నేతల నుంచి ధిక్కారస్వరం వినిపిస్తోంది. -
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. -
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
తాను ఎక్కడున్నా ఓ కన్ను కొడంగల్పైనే ఉంటుందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
భూమా అఖిలప్రియను అడ్డుకున్న వైకాపా నేతలు.. యర్రగుంట్లలో ఉద్రిక్తత
మాజీ మంత్రి, ఆళ్లగడ్డ తెదేపా అభ్యర్థి భూమా అఖిలప్రియను వైకాపా నేతలు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
వైకాపా ప్రభుత్వం పని అయిపోయిందని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు ఎన్డీయే కూటమికి మద్దతివ్వాలని కోరారు. -
కేసీఆర్ ఎవరినీ నమ్మలేదు.. అందుకే ఫోన్ ట్యాపింగ్: భాజపా ఎంపీ లక్ష్మణ్
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు భారాసను ఓడించి శిక్ష విధించినా ఆ పార్టీ నేతలు అహంకారాన్ని వీడటం లేదని భాజపా ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. -
కొనసాగుతున్న మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు. -
కంగనపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సుప్రియా శ్రీనేత్కు కాంగ్రెస్ షాక్!
Congress: కంగనా రనౌత్పై కాంగ్రెస్ నేత సుప్రియ శ్రీనేత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో ఆమెను పార్టీ తాజా లోక్సభ అభ్యర్థుల జాబితా నుంచి తప్పించింది. -
ఇంటికి కిలో బంగారం పంచినా జగన్కు ఓటమే
అయిదేళ్ల అరాచక పాలనతో విసిగిన జనం.. జగన్ను తాడేపల్లి ప్యాలెస్లో శాశ్వతంగా బంధించేందుకు నిర్ణయించుకున్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. -
నగదు, మద్యం దొరికినా అధికారులు స్పందించరేం?
తిరుపతి సమీపంలోని రేణిగుంట వద్ద వైకాపా నేతలకు చెందిన మద్యం, నగదు, ప్రచార సామగ్రి డంప్లు దొరికినా.. జిల్లా కలెక్టర్, ఆర్వోలు చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏంటని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. -
ప్రకాశం ఇనుప ఖనిజాన్ని విశాఖ ఉక్కుకు కేటాయించాలి: సీపీఎం
ప్రకాశం జిల్లా యర్రజర్లకొండ ఇనుప ఖనిజాన్ని విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనుల కింద కేటాయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు లేఖ రాశారు. -
రాయలసీమ ద్రోహిని అడ్డుకోండి
యాత్రపేరుతో పరదాల చాటు నుంచి ముసుగువీరుడు బయటకొచ్చారని... ‘జగన్ నువ్వు రాయలసీమ ద్రోహివి.. ఇక్కడికి రావడానికి వీల్లేదు’ అని జనం గట్టిగా చెప్పాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. -
ముందు చెల్లికి సమాధానం చెప్పాలి
బస్సు యాత్ర పేరిట ఇడుపులపాయకు వెళ్లిన జగన్... బాబాయిని గొడ్డలితో చంపించిన వ్యక్తిని వెంట బెట్టుకుని బయటకొచ్చారని, అయిదేళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్న చెల్లి సునీత ఆవేదనను పట్టించుకోక పోవడమే కాకుండా సొంత చెల్లి షర్మిలకూ అన్యాయం చేశారని చంద్రబాబు విమర్శించారు. -
రాప్తాడు వైకాపా ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డికి అసమ్మతి సెగ
‘పరిటాల కుటుంబంతో పోరాటం అన్నది నా ఒక్కడితో సాధ్యం కాదు.. ఇప్పటికే ఒకసారి ఓడిపోయి ఇల్లు అమ్ముకొని రోడ్డున పడ్డానని ప్రకాశ్రెడ్డి అంటే ఆయనను ఇంట్లో కూర్చోబెట్టాం..మమ్మల్ని మాత్రం ఆయన రోడ్డున పడేశారు. -
మట్టి మింగేస్తున్నారు.. మనుషుల్ని చంపేస్తున్నారు
‘వైకాపా పాలనలో అక్రమ తవ్వకాలతో మట్టిని మింగేస్తున్నారు.. ప్రశ్నించిన మనుషులనూ చంపేస్తున్నారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది. -
పవన్కల్యాణ్తో నాయకుల సమావేశం
ఒంగోలు ఎంపీ, తెదేపా నేత మాగుంట శ్రీనివాసులురెడ్డి.. జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్తో భేటీ అయ్యారు. -
తెలిసే.. వదిలేశారా?
అధికార వైకాపా తాయిలాల పంపిణీలో దూసుకుపోతుంటే తిరుపతి జిల్లా యంత్రాంగం చోద్యం చూస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
లోక్సభ, అసెంబ్లీ స్థానాల్లో మూడు పార్టీల ఉమ్మడి భేటీలు
ఎన్నికల కార్యాచరణ, క్షేత్రస్థాయిలో ప్రచార వ్యూహాల రూపకల్పన తదితర అంశాలపై చర్చించేందుకు ఏప్రిల్ 4న లోక్సభ నియోజకవర్గాల స్థాయిలో, 8న శాసనసభ నియోజకవర్గాల స్థాయిలో ఉమ్మడి సమావేశాల్ని నిర్వహించాలని తెదేపా, జనసేన, భాజపా నిర్ణయించాయి. -
కేసుల్లోనూ నంబర్ వన్ ముఖ్యమంత్రి జగనే
దేశంలోని ముఖ్యమంత్రులు అందరిలోకెల్లా ధనవంతుడైన జగన్.. కేసుల్లోనూ ముందు వరుసలోనే ఉన్నారని మాజీ ఎమ్మెల్సీ, తెదేపా నేత దీపక్రెడ్డి ఎద్దేవా చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ