‘జగన్ కేసులతో రాష్ట్రంపై రూ.30కోట్ల భారం’
సీబీఐ, ఈడీ కేసులు పర్యవేక్షించుకునేందుకే ఇవాళ అసెంబ్లీకి సెలవు ప్రకటించారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో....
మాజీ మంత్రి దేవినేని ఉమా
మంగళగిరి: సీబీఐ, ఈడీ కేసులు పర్యవేక్షించుకునేందుకే ఇవాళ అసెంబ్లీకి సెలవు ప్రకటించారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉమా మాట్లాడుతూ...రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని మండిపడ్డారు.
‘‘సీఎం జగన్ తన సొంత అజెండా అమలు చేస్తున్నారు. సీఎం ఎంత ప్రయత్నించినా మండలి రద్దు కాదు. మండలి విషయంలో సీఎం తప్పుడు నిర్ణయం తీసుకుంటే కోర్టుకెళ్తాం. ఏ2 ముద్దాయి విజయ సాయిరెడ్డికి మండలిలో ఏం పని? విజయ సాయిరెడ్డి బెయిల్ రద్దు కోరుతూ కోర్టును ఆశ్రయిస్తాం. ఎమ్మెల్సీలను ప్రలోభ పెట్టేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోంది. మండలి ఛైర్మన్పై దాడికి యత్నించారు. తప్పు చేస్తున్నందునే మండలి ప్రసారాల లైవ్ నిలిపివేశారు. రాజధాని రైతులను అమానుషంగా హింసిస్తున్నారు. మీడియాపై ఆంక్షలా? ప్రశ్నిస్తే కేసులా?అవినీతి, అక్రమాస్తుల కేసుల్లో సీఎం జగన్ కోర్టుకు హాజరు కావడం వల్ల ప్రభుత్వంపై ఏడాదికి రూ.30కోట్ల వరకు భారం పడుతుంది. అవినీతి సీఎం వల్ల రాష్ట్ర ప్రజలు ఆ భారం భరించాలా?’’ అని ఉమా ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు