రాజధాని తరలింపును ఆపలేరు: కన్నబాబు

తెదేపా మోకాలు అడ్డుపెట్టినంత మాత్రాన మూడు రాజధానుల ఏర్పాటు ఆగబోదని ఏపీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. సంఖ్యాబలం ఉందని శాసన మండలిలో కుట్రలు చేసి ఇప్పటి వరకు మూడు బిల్లులను అడ్డుకున్నారని...

Published : 25 Jan 2020 00:32 IST

విజయవాడ: తెదేపా మోకాలు అడ్డుపెట్టినంత మాత్రాన మూడు రాజధానుల ఏర్పాటు ఆగబోదని ఏపీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. సంఖ్యాబలం ఉందని శాసన మండలిలో కుట్రలు చేసి ఇప్పటి వరకు మూడు బిల్లులను అడ్డుకున్నారని ఆయన విమర్శించారు. విజయవాడలో కన్నబాబు మీడియాతో మాట్లాడారు. కొద్దిరోజులు ఆలస్యమైనా రాజధాని తరలింపును ఆపలేరని.. అందులో సందేహం ఎందుకని ప్రశ్నించారు. ప్రజల ఆకాంక్షల మేరకు అభివృద్ధి వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. శాసన మండలి ఛైర్మన్‌కు విచక్షణాధికారం ఉన్నప్పుడు..తాను ఎక్కడ కూర్చొని పరిపాలించాలనే విషయంలో సీఎంకు అధికారం ఉండదా? అని ప్రశ్నించారు. ఎక్కడ సీఎం ఉంటే వ్యవస్థంతా అక్కడే ఉంటుందని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని