మండలి ఉండొచ్చు.. ఉండకపోవచ్చు: అంబటి
వైఎస్సార్ విధానాలు పాటిస్తామన్నంత మాత్రాన ఆయన మాదిరిగా శాసనమండలిని కొనసాగించాల్సిన అవసరం లేదని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. విచక్షణ మేరకే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. శాసనమండలి రద్దు చేస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో...
అమరావతి: వైఎస్సార్ విధానాలు పాటిస్తామన్నంత మాత్రాన ఆయన మాదిరిగా శాసనమండలిని కొనసాగించాల్సిన అవసరం లేదని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. విచక్షణ మేరకే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. శాసనమండలి రద్దు చేస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మండలి రద్దుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. శాసనమండలి ఉండొచ్చు.. ఉండకపోవచ్చని వ్యాఖ్యానించారు.
గతంలో వైఎస్సార్ మండలిని పునరుద్ధరిస్తే.. ఇప్పుడు ఆయన తనయుడు రద్దు చేస్తున్నారన్న వార్తలపై ఆయన స్పందిస్తూ.. ఒక జాతీయ పార్టీకి వైఎస్సార్ సీఎంగా పనిచేశారని గుర్తుచేశారు. ఆ పార్టీ విధానాలకు అనుగుణంగా నడుచుకుని ఉండొచ్చన్నారు. వైఎస్సార్లా మండలి సాగించాల్సిన అవసరం లేదన్నారు. ఆయన పథకాలను, విధానాలను మాత్రం కొనసాగిస్తామన్నారు. రాజధాని మార్పు అంశం పూర్తిగా రాష్ట్ర పరిధిలోనిదే ఉద్ఘాటించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధమూ లేదని అంబటి అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!