మండలి రద్దు అవసరం ఏముంది:యనమల

శాసనమండలి రద్దు చేయడం ప్రజావేదిక కూల్చినంత తేలిక కాదని తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. 2021కల్లా శాసనమండలిలో వైకాపాకు మెజార్టీ వస్తుందని ఆయన ట్విటర్‌లో

Updated : 27 Jan 2020 10:29 IST

అమరావతి: శాసనమండలి రద్దు చేయడం ప్రజావేదిక కూల్చినంత తేలిక కాదని తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. 2021కల్లా శాసనమండలిలో వైకాపాకు మెజార్టీ వస్తుందని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. అలాంటప్పడు రద్దు అవసరం ఏముందని ప్రశ్నించారు. ఒకవేళ రద్దుకు ప్రతిపాదించినా.. దానిని అమలు చేసేందుకు రెండు మూడేళ్లు పడుతుందని, అప్పటి వరకు శాసనమండలి కొనసాగుతూనే ఉంటుందని యనమల చెప్పారు. ఒక నిర్మాణాత్మక పంథాలో ఏర్పడిన సభగా మండలిని యనమల అభివర్ణించారు. రాజ్యాంగ వ్యవస్థల రద్దు అనుకున్నంత సులభం కాదన్నారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా, బెదిరించినా లొంగకుండా తెదేపా ఎమ్మెల్సీలంతా దృఢంగా ఉన్నారని యనమల కొనియాడారు.
 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని