‘చేసిన తప్పులను జగన్‌ సరిచూసుకోవడం లేదు’

అమరావతి రాష్ట్ర ప్రజల హక్కు.. దాన్ని కచ్చితంగా పరిరక్షిస్తానని చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతిలో ఎదరువుతున్న సమస్యలను చంద్రబాబుకు వివరించేందుకు రాజధాని రైతులు, మహిళలు పార్టీ కార్యాలయానికి మంగళవారం వచ్చారు. ఈ సందర్భంగా పలు సమస్యలను వారు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘తమ మాట

Published : 29 Jan 2020 00:32 IST

అమరావతి: అమరావతి రాష్ట్ర ప్రజల హక్కు.. దాన్ని కచ్చితంగా పరిరక్షిస్తానని చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతిలో ఎదరువుతున్న సమస్యలను చంద్రబాబుకు వివరించేందుకు రాజధాని రైతులు, మహిళలు పార్టీ కార్యాలయానికి మంగళవారం వచ్చారు. ఈ సందర్భంగా పలు సమస్యలను వారు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘తమ మాట వినలేదని మండలి ఛైర్మన్‌ను ఇష్టం వచ్చినట్లు తిట్టారు. చేసిన తప్పులను సీఎం జగన్‌ సరిచూసుకోవడం లేదు. నేను జోలె పట్టింది ఐదు కోట్ల మంది ప్రజల కోసం. నేను మొదలుపెట్టిన పనులను వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కొనసాగించారు. నేను ప్రారంభించిన పనులను తర్వాత వచ్చిన వైఎస్‌ ఆపలేదు. మండలిని తండ్రి తీసుకువస్తే.. కుమారుడు రద్దు చేశారు. విశాఖలో భూములు కొని అక్కడ డబ్బు సంపాదిస్తున్నారు’’ అని చంద్రబాబు విమర్శించారు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు