కావాలంటే అన్నీ విశాఖలోనే పెట్టండి: అయ్యన్న
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. విశాఖ నుంచి లూలూ, అదానీ కంపెనీలు పారిపోయాయని...
విశాఖ: వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. విశాఖ నుంచి లూలూ, అదానీ కంపెనీలు పారిపోయాయని దుయ్యబట్టారు. అసెంబ్లీకి దొడ్డిదారిన.. హైకోర్టుకు మాత్రం రాజమార్గంలో కాన్వాయ్లో సీఎం జగన్ వెళతారని ఎద్దేవాచేశారు. ఇప్పుడు మూడు రాజధానులకు మద్దతు పలుకుతున్న మంత్రి బొత్సకు.. గతంలో మంత్రిగా పనిచేసినప్పుడు ఉత్తరాంధ్ర అభివృద్ధి కనిపించలేదా? అని ప్రశ్నించారు.
అమరావతి నుంచి రాజధాని మారే ప్రసక్తే లేదని అయ్యన్నపాత్రుడు స్పష్టంచేశారు. రాజధాని గురించి మేనిఫెస్టోలో ఎక్కడా చెప్పకుండా.. ఇవాళ ఎవరు కోరారని రాజధాని మారుస్తున్నారని సీఎం జగన్ను నిలదీశారు. అసెంబ్లీ అమరావతిలో, సెక్రటేరియట్ విశాఖలో ఉంటే పరిపాలన సజావుగా ఎలా సాగుతుందని ప్రశ్నించారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని తమ నినాదమని చెప్పారు. కావాలంటే విశాఖలోనే సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు అన్నీ పెట్టాలని సూచించారు. రాజధాని విశాఖకు వస్తే అమరావతిలో ఉన్న ఉద్యోగులు ఇక్కడకు వస్తారే తప్ప పెద్దగా మార్పేమీ ఉండదన్నారు. నిజంగా విశాఖను అభివృద్ధి చెయ్యాలనుకుంటే పరిశ్రమలు తీసుకురావాలని ప్రభుత్వానికి హితవు పలికారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్