కావాలంటే అన్నీ విశాఖలోనే పెట్టండి: అయ్యన్న

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. విశాఖ నుంచి లూలూ, అదానీ కంపెనీలు పారిపోయాయని...

Updated : 08 Dec 2022 12:50 IST

విశాఖ: వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. విశాఖ నుంచి లూలూ, అదానీ కంపెనీలు పారిపోయాయని దుయ్యబట్టారు. అసెంబ్లీకి దొడ్డిదారిన.. హైకోర్టుకు మాత్రం రాజమార్గంలో కాన్వాయ్‌లో సీఎం జగన్‌ వెళతారని ఎద్దేవాచేశారు. ఇప్పుడు మూడు రాజధానులకు మద్దతు పలుకుతున్న మంత్రి బొత్సకు.. గతంలో మంత్రిగా పనిచేసినప్పుడు ఉత్తరాంధ్ర అభివృద్ధి కనిపించలేదా? అని ప్రశ్నించారు.

అమరావతి నుంచి రాజధాని మారే ప్రసక్తే లేదని అయ్యన్నపాత్రుడు స్పష్టంచేశారు. రాజధాని గురించి మేనిఫెస్టోలో ఎక్కడా చెప్పకుండా.. ఇవాళ ఎవరు కోరారని రాజధాని మారుస్తున్నారని సీఎం జగన్‌ను నిలదీశారు. అసెంబ్లీ అమరావతిలో, సెక్రటేరియట్‌ విశాఖలో ఉంటే పరిపాలన సజావుగా ఎలా సాగుతుందని ప్రశ్నించారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని తమ నినాదమని చెప్పారు. కావాలంటే విశాఖలోనే సెక్రటేరియట్‌, అసెంబ్లీ, హైకోర్టు అన్నీ పెట్టాలని సూచించారు. రాజధాని విశాఖకు వస్తే అమరావతిలో ఉన్న ఉద్యోగులు ఇక్కడకు వస్తారే తప్ప పెద్దగా మార్పేమీ ఉండదన్నారు. నిజంగా విశాఖను అభివృద్ధి చెయ్యాలనుకుంటే పరిశ్రమలు తీసుకురావాలని ప్రభుత్వానికి హితవు పలికారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని