రాయిటర్స్ను ప్రభావితం చేశారు: ఎంపీ మాధవ్
రాజధానిని రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ సీఎం జగన్కు విజ్ఞప్తి చేశారు. కియా తరలిపోతుందనే అవాస్తవ ప్రచారాన్ని రాయిటర్స్ సంస్థ ద్వారా చంద్రబాబు సృష్టించి భంగపడ్డారని ఆరోపించారు. రాయిటర్స్ను
అనంతపురం: రాజధానిని రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ సీఎం జగన్కు విజ్ఞప్తి చేశారు. కియా తరలిపోతుందనే అవాస్తవ ప్రచారాన్ని రాయిటర్స్ సంస్థ ద్వారా చంద్రబాబు సృష్టించి భంగపడ్డారని ఆరోపించారు. రాయిటర్స్ను చంద్రబాబు ప్రభావితం చేశారని విమర్శించారు. రాయలసీమ జిల్లాల్లో ఇంకా దుర్బర పరిస్థితులు కొనసాగుతున్నాయన్నారు. రాయలసీమ అభివృద్ధిని అడ్డుకోవద్దని చంద్రబాబును కోరారు. రాయలసీమకు జగన్ చేస్తున్నది ఇంకా తక్కువేనని మాధవ్ అభిప్రాయపడ్డారు. పార్లమెంట్లో తాను తెదేపా ఎంపీలపై దాడి చేశానంటూ చేస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. లోక్సభలో కియాపై అసత్యాలను ప్రస్తావిస్తుంటే అడ్డుకున్నానని, అది తన బాధ్యత అని స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.