వైకాపా ఎమ్మెల్యేలు రాజీనామాకుసిద్ధమా?:బుద్ధా
వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ బెదిరింపుల వల్లే కియా పరిశ్రమ ఇతర రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి నెలకొందని తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
మంగళగిరి: వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ బెదిరింపుల వల్లే కియా పరిశ్రమ ఇతర రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి నెలకొందని తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెదేపా అధినేత చంద్రబాబును మాధవ్ విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మాధవ్ వ్యవహార శైలితో హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు విసిగిపోయారని విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా.. మాధవ్ను నియోజకవర్గం నుంచి ఎప్పుడు సాగనంపుదామా అని హిందూపురం ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. సీఐగా ఉన్నప్పుడు గోరంట్ల మాధవ్ అవినీతి గురించి ఆయన పనిచేసిన ప్రతి పోలీస్ స్టేషన్లో చెప్తారన్నారు. అమరావతి ప్రజాభిప్రాయ సేకరణపై విశాఖ జిల్లాలోని నలుగురు తెదేపా ఎమ్మెల్యేలతో పాటు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కూడా రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. అమరావతి ప్రాంతంలోని వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలకు రాజీనామా చేసే దమ్ముందా?అని బుద్ధా సవాల్ విసిరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!