ఫలితమేదైనా.. నాదే బాధ్యత: తివారీ
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీకి మరోసారి నిరాశ కలిగించాయి. తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో ఆప్ విజయం దిశగా దూసుకెళ్తోండగా.. కాషాయ పార్టీ రెండో స్థానానికి పరిమితమైంది.
దిల్లీ: దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీకి మరోసారి నిరాశ కలిగించాయి. తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో ఆప్ విజయం దిశగా దూసుకెళ్తుండగా.. కాషాయ పార్టీ రెండో స్థానానికి పరిమితమైంది. అయితే తుది ఫలితం వచ్చేంతవరకు గెలుపుపై తమకు నమ్మకముందని అంటున్నారు భాజపా దిల్లీ అధ్యక్షుడు మనోజ్ తివారీ.
‘ట్రెండ్స్ను చూస్తుంటే చాలా చోట్ల భాజపా, ఆమ్ ఆద్మీ మధ్య స్వల్ప తేడానే ఉంది. ఇంకా సమయం ఉంది. గెలుపుపై మేం నమ్మకంగా ఉన్నాం. అయితే రాష్ట్ర అధ్యక్షుడిగా ఫలితం ఏదైనా అందుకు పూర్తి బాధ్యత నాదే’ అని తివారీ అన్నారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమవడానికి ముందు భాజపా 55 స్థానాల్లో విజయం సాధిస్తుందంటూ తివారీ ధీమా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.