గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపిన కోమటిరెడ్డి

కేంద్ర రవాణాశాఖమంత్రి నితిన్‌ గడ్కరీకి భువనగిరి కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కృజ్ఞతలు తెలిపారు. మంగళవారం ఉదయం కేంద్రమంత్రిని కలిసిన ఎంపీ .. నకిరేకల్‌ నుంచి నాగార్జున సాగర్‌ వరకు రహదారి పనులకోసం  రూ.200 కోట్లు మంజూరు చేసినందుకు

Updated : 11 Feb 2020 13:34 IST

దిల్లీ: కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి భువనగిరి కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం ఉదయం కేంద్రమంత్రిని కలిసిన ఎంపీ .. నకిరేకల్‌ నుంచి నాగార్జున సాగర్‌ వరకు రహదారి పనులకోసం  రూ.200 కోట్లు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. తక్షణం పనులు పూర్తి చేసేలా అధికారులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. వలిగొండ, తొర్రూరు, నెల్లికుదురు, మహబూబ్‌నగర్‌, ఇల్లెందు మీదుగా హైదరాబాద్‌- కొత్తగూడెం మధ్య రహదారిని జాతీయ రహదారిగా గుర్తించినా మరమ్మతులకు నోచుకోవడం లేదని కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. దీనికి సంబంధించి 2016లోనే డీపీఆర్‌ సిద్ధం చేసినా నేటికీ పనులు ప్రారంభం కాలేదని వివరించారు. జాతీయ రహదారి 65 విస్తరణ పనుల కోసం రూ.375 కోట్లు మంజూరు చేసినందుకు కూడా కేంద్ర మంత్రికి కోమటిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని