ఆమ్‌ఆద్మీలో భారీ చేరికలు 

దిల్లీ: ఆమ్‌ఆద్మీపార్టీ మూడవసారి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల నుంచి భారీ మద్దతు వచ్చిందని పార్టీ పేర్కొంది. ఎన్నికల ఫలితాలు వెలుబడిన 24గంటల్లోనే 10లక్షలపైగా ప్రజలు ఫోన్‌ద్వారా తమ పార్టీకి మద్దతు తెలిపినట్లు ట్విట్టర్‌లో ప్రకటించింది.

Updated : 13 Feb 2020 16:55 IST

ఒక్కరోజులోనే పార్టీకి 10లక్షల మంది మద్దతు

దిల్లీ: ఆమ్‌ఆద్మీపార్టీ మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల నుంచి భారీ మద్దతు లభించిందని పార్టీ పేర్కొంది. ఎన్నికల ఫలితాలు వెలుబడిన 24గంటల్లోనే 10లక్షల మందికిపైగా ప్రజలు ఫోన్‌ద్వారా తమ పార్టీకి మద్దతు తెలిపినట్లు ట్విట్టర్‌లో ప్రకటించింది. తాజా ఫలితాల్లో 70స్థానాలకు 62సీట్లలో గెలిచి విజయ ఢంకా మోగించింది. దేశాభివృద్ధిలో భాగంగా భారతీయులందరూ ఆమ్‌ఆద్మీ పార్టీలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చింది. తమ పార్టీకి మద్దతు తెలిపే వారు వారు పేర్కొన్న ఫోన్‌ నంబరుకు కాల్‌ చేయాలని కోరింది. దీంతో 24గంటల్లోనే ప్రజలు భారీగా స్పందించారు. అతి తక్కువ సమయంలోనే ప్రజల నుంచి వచ్చిన భారీ స్పందనకు పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

తాజా ఎన్నికల్లో మొత్తం ఓట్లలో 38శాతం ఓట్లను బీజేపీ సాధించగా.. 53శాతం ఓట్లతో ఆమ్‌ఆద్మీపార్టీ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. 
 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని