రాజధాని మారిస్తే చూస్తూ ఊరుకోం: పవన్‌

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ శనివారం రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాల్లో పర్యటించారు. కృష్ణాయపాలెం, ఎర్రబాలెంలో రైతుల దీక్షకు మద్దతు తెలిపి ...

Updated : 15 Feb 2020 14:16 IST

అమరావతి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ శనివారం రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాల్లో పర్యటించారు. కృష్ణాయపాలెం, ఎర్రబాలెంలో రైతుల దీక్షకు మద్దతు తెలిపి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చినట్టు రాలేదని, రైతులకు భరోసా ఇవ్వడానికే వచ్చానని తెలిపారు.

‘‘రాజధాని ఎక్కడ ఉండాలనేది ప్రభుత్వ నిర్ణయం. అయితే, గతంలోనే ఆ నిర్ణయం తీసకున్నారు. ఇప్పుడు రాజధాని మార్చే అధికారం ఈ ప్రభుత్వానికి లేదు. గత ప్రభుత్వం నిర్ణయించినప్పుడు.. వైకాపా కూడా అంగీకరించింది. ఇప్పుడు రాజధాని మారుస్తామంటే చూస్తూ ఊరుకోం. రాజధాని ఎక్కడికీ పోదని భరోసా ఇవ్వడానికే ఇక్కడికి వచ్చా. రైతులకు మద్దతుగా ర్యాలీ చేద్దామనుకున్నాం. దిల్లీ ఎన్నికల కారణంగా  అది వాయిదా వేశాం. త్వరలోనే ర్యాలీ నిర్వహిస్తాం. అమరావతి రైతులకు అండగా ఉంటామని భాజపా పెద్దలు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో రైతులకు అన్యాయం జరగదు. ఎవరు వచ్చినా రాకున్నా నేను..మీకు అండగా ఉంటా’’ అని పవన్‌ కల్యాణ్ స్పష్టం చేశారు.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని