మందడంలో పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకొని ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మందడంలో రైతులు, మహిళల నిరసనకు...
మందడం: ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకొని ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మందడంలో రైతులు, మహిళల నిరసనకు ఆయన సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా రాజధాని మహిళలు తమ సమస్యలను జనసేనానికి వివరించారు. అనంతరం పవన్ మాట్లాడుతూ.. అధికార వికేంద్రీకరణపై జగన్ ఎన్నికలకు ముందే ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. పదవిలో లేకుంటే ఒకలా.. ఉంటే మరోలా మాట్లాడతారా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. రాజధాని ఉద్యమంలో రైతులకు అండగా పోరాటం చేస్తానని పవన్ పునరుద్ఘాటించారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర వైపు వెళ్లినప్పుడు అక్కడి ప్రజలు అమరావతి రైతుల కన్నీళ్లపై రాజధాని వస్తే మాకేం ఆనందం ఉంటుందని అంటున్నారని పవన్ చెప్పారు.
రోజూ వార్తల్లో కనిపించే వ్యక్తినికాదు!
‘‘నాకు అధికారం లేదు.. ఉన్న ఒక్క ఎమ్మెల్యే ఉన్నారో, లేదో తెలియదు. నేను ఓట్ల కోసం రాలేదు.. మీకు ఆసరాగా ఉండాలని వచ్చా. రైతులపై జరిగిన దాడిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాను. నేను ప్రతిరోజూ వార్తల్లో కనిపించే వ్యక్తిని కాదు. పత్రికల్లో కనిపించడం కోసం వార్తలను సృష్టించను.. లేని వార్తలను సృష్టించను. ఉన్న సమస్యను బలంగా వినిపిస్తా. జగన్ ఇప్పుడే కళ్లు తెరిచిన పసిపాపలా మాట్లాడుతున్నారు. రాజకీయ క్రీడలో పోలీసులు భాగం కాకూడదు’’ అని పవన్ అన్నారు.
సీఎం.. ఏ రాజధానికి నిధులడిగారు?
‘‘రాజధాని తరలింపును రియల్ ఎస్టేట్ క్రీడలా మార్చారు. మూడు రాజధానుల అంశం సమ్మతం కాదని కేంద్ర పెద్దలు చెప్పారు. భాజపాతో పొత్తు పెట్టుకొనేటప్పుడే దీనిపై స్పష్టత తీసుకున్నా. బేషరతుగా భాజపాతో పొత్తు పెట్టుకున్నాం.. సీట్ల గురించి మాట్లాడలేదు. అమరావతి విషయంలో మాత్రం స్పష్టత తీసుకున్నా. జనసేన, భాజపా అమరావతికి కట్టుబడి ఉన్నాయి. రాజధానికి నిధులు అడిగామని సీఎం జగన్ అంటున్నారు. ఏ రాజధానికి నిధులు అడిగారో సమాధానం చెప్పాలి. మళ్లీ విశాఖలో భూములు ఎందుకు తీసుకుంటున్నారు?’’ అని జనసేనాని ప్రశ్నించారు.
పొత్తులపై వైకాపా నేతలవన్నీ అబద్ధాలే..
‘‘పొత్తులపై వైకాపా నేతల వ్యాఖ్యలన్నీ అబద్ధాలే. భాజపా, వైకాపా పొత్తు పెట్టుకుంటే అందులో నేనుండను. భాజపా అలాంటి పనిచేస్తుందని భావించడం లేదు. ఒకవేళ రాజధాని మార్చినా మళ్లీ అమరావతికే తీసుకొస్తాం. రాజధాని తరలింపు వివాదానికి చంద్రబాబు, జగన్దే బాధ్యత. రాజధాని భూములను ఇళ్లస్థలాలకు ఇస్తామనడం సరికాదు. రాజధాని రైతులు తమ భూములను నవరత్నాల కోసం ఇవ్వలేదు. అమరావతిని కదిలించే శక్తి జగన్కు లేదు. రాజధాని అమరావతికి భాజపా, జనసేన కట్టుబడి ఉన్నాయి. రాజధాని అమరావతిగా ఉంటుందని ఒప్పందం రాసుకున్నాం. ఇంత పెట్టుబడిపెట్టాక రాజధాని తరలింపు సరికాదు’’ అని పవన్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
నెల్లూరు జిల్లాలో అధికార పార్టీకి వాలంటీర్లు దూరమవుతున్నారు. -
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
First phase of LS polls: లోక్సభ ఎన్నికల తొలి విడతలో.. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఓటింగ్ జరుగుతున్న అన్ని రాష్ట్రాల్లో కలిపి దాదాపు 50శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. -
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
భారాస అధినేత కేసీఆర్ (KCR) రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. -
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
ఆంధ్రప్రదేశ్లో రెండో రోజు నామినేషన్ల పర్వం సందడిగా సాగింది. -
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
తెలంగాణలో నామినేషన్ దాఖలు ప్రక్రియ ఊపందుకుంది. వివిధ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. -
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల
రాష్ట్ర మంతా వైకాపా మాఫియా రాజ్యమేలుతోందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. -
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
కారు షెడ్డు నుంచి బయటకు రాదు.. పాడైపోయిందని భారాసను ఉద్దేశించి సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. -
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మధ్య పొత్తును ప్రస్తావిస్తూ ‘ఇద్దరు యువరాజులు నటించిన చిత్రాన్ని’ ఉత్తరప్రదేశ్ ప్రజలు తిరస్కరించారని ప్రధాని మోదీ (PM Modi) శుక్రవారం అన్నారు. -
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
తెదేపా అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ మూడోసారి నామినేషన్ వేశారు. తన సతీమణి వసుంధరతో కలిసి హిందూపురం ఆర్వో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. -
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
Lok sabha Elections: తొలి విడత ఎన్నికలు జరుగుతున్న పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు చోటుచేసుకున్నాయి. -
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
తెదేపా అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ వేశారు. -
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. -
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై వ్యాఖ్యలు చేయొద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఆయన కుమార్తె సునీత స్పందించారు. -
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నేడు కుప్పంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. -
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
మరో ఎమ్మెల్యే భారాసను వీడనున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ శుక్రవారం సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. -
అన్నదాతల ఆత్మహత్యలన్నీ జగన్ ప్రభుత్వం చేసిన హత్యలే: ప్రత్తిపాటి పుల్లారావు
జగన్ పాలనలో రైతుల జీవితాలు గాలిలో దీపంగా మారాయని తెదేపా నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. -
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
కపటనీతికి మారుపేరు కాంగ్రెస్ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్(ట్విటర్) వేదికగా విమర్శించారు. -
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
Lok sabha Elections: లోక్సభ ఎన్నికల తొలివిడత పోలింగ్లో దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఓటేస్తున్నారు. దేశవాసులు ఈ ప్రజాస్వామ్య పండగలో భాగం కావాలని పిలుపునిస్తున్నారు. -
భాజపా వైపు పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత చూపు?
పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత భాజపాలో చేరే అవకాశాలున్నట్లు తెలిసింది. -
‘కృష్ణుడి గోపికను నేనే’: హేమామాలిని
సీనియర్ నటి, భాజపా మథుర నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి హేమామాలిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణుడికి గోపికగా తనను తాను భావించుకుంటానని తెలిపారు. -
పెద్ద సంఖ్యలో తరలిరండి.. ఓటర్లకు ప్రధాని మోదీ పిలుపు
Lok Sabha polls: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..