మండలి ఛైర్మన్కు ఆ అధికారం ఉంది
ఇటీవల జరిగిన ఐటీ దాడులపై వైకాపా నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. అవాస్తవాలు ప్రచురించిన సాక్షిని బ్లాక్లిస్ట్లో పెట్టేందుకు అన్ని ఆధారాలూ ఉన్నాయన్నారు. త్వరలోనే
అమరావతి: ఇటీవల జరిగిన ఐటీ దాడులపై వైకాపా నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. అవాస్తవాలు ప్రచురించిన సాక్షిని బ్లాక్లిస్ట్లో పెట్టేందుకు అన్ని ఆధారాలూ ఉన్నాయన్నారు. త్వరలోనే ప్రెస్ కౌన్సిల్, ఎడిటర్స్ గిల్డ్కు ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు. పరువు నష్టం దావా కూడా వేసేందుకు ఆధారాలు ఉన్నాయని చెప్పారు. సెలెక్ట్ కమిటీ దస్త్రాన్ని మళ్లీ వెనక్కి పంపడం రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. శాసన పరిషత్ కార్యదర్శిపై చర్యలు తీసుకొనే అధికారం మండలి ఛైర్మన్కు ఉందన్న యనమల.. కార్యదర్శిపై ప్రభుత్వం అంత ఒత్తడి తేవాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. కేంద్రం, రాష్ట్రపతికి వాస్తవ పరిస్థితులను వివరించాల్సిన బాధ్యత తమపై ఉందనీ.. అందుకనుగుణంగానే త్వరలోనే ఎమ్మెల్సీలు దిల్లీకి వెళ్తారని చెప్పారు. అలాగే, గవర్నర్ను కూడా కలిసి వాస్తవాలు వివరిస్తామని తెలిపారు. ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలకు వ్యతిరేకంగానే తమ విధానం ఉంటుందని యనమల స్పష్టంచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్