చంద్రబాబుకు భద్రత తగ్గించలేదు: సుచరిత

తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు భద్రత తగ్గించారన్న ఆరోపణల్లో నిజం లేదని ఏపీ హోంమంత్రి సుచరిత అన్నారు. ప్రతిపక్ష నేతకు భద్రత  తగ్గించలేదనీ.. జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రతనే కొనసాగిస్తున్నట్టు తెలిపారు.

Published : 19 Feb 2020 21:46 IST

గుంటూరు: తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు భద్రత తగ్గించారన్న ఆరోపణల్లో నిజం లేదని ఏపీ హోంమంత్రి సుచరిత అన్నారు. ప్రతిపక్ష నేతకు భద్రత  తగ్గించలేదనీ.. జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రతనే కొనసాగిస్తున్నట్టు తెలిపారు. బుధవారం ఆమె గుంటూరులోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు ఉండవల్లిలో 135 మంది, హైదరాబాద్‌లో 48 మందితో భద్రత కల్పిస్తున్నట్టు వివరించారు. కానీ చంద్రబాబుకు 53 మంది భద్రతా సిబ్బందే ఉన్నారని తెదేపా ఆరోపిస్తోందన్నారు. అలా ప్రచారం చేయడం సరికాదని హితవుపలికారు. వీఐపీల భద్రతపై ఆరు నెలలకోసారి సమీక్ష జరుగుతుందన్నారు. పీఎస్‌పై ఐటీ దాడుల గురించి కాకుండా భద్రతపై మాట్లాడటం సరికాదని సుచరిత అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు