ఏపీ ఈఎస్ఐలో రూ.70కోట్ల అవినీతి!
ఏపీ ఈఎస్ఐలో భారీగా అవకతవకలు జరిగినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. రూ.975 కోట్లతో కొనుగోలు చేసిన ఔషధాలు, పరికరాల్లో రూ.70 కోట్ల అవినీతి జరిగినట్లు అధికారులు తేల్చారు. 2014-2019 వరకు జరిపిన కొనుగోళ్ల
అమరావతి: ఏపీ ఈఎస్ఐలో భారీగా అవకతవకలు జరిగినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. రూ.975 కోట్లతో కొనుగోలు చేసిన ఔషధాలు, పరికరాల్లో రూ.70 కోట్ల అవినీతి జరిగినట్లు అధికారులు తేల్చారు. 2014-2019 వరకు జరిపిన కొనుగోళ్ల డాక్యుమెంట్లను విజిలెన్స్ అధికారులు పరిశీలించగా ముగ్గురు డైరెక్టర్ల పదవీకాలంలో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 ఈఎస్ఐ ఆస్పత్రులు, 3 డయాగ్నోస్టిక్ సెంటర్లు, 78 ఈఎస్ఐ డిస్పెన్సరీలకు ఔషధాలు, పరికరాల కొనుగోలులో అవినీతి జరిగింది. ఈఎస్ఐలో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు.
బాధ్యులెవర్నీ వదిలిపెట్టం: మంత్రి జయరాం
ఈఎస్ఐలో జరిగిన అవినీతికి బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఈ అవకతవకలు జరిగాయన్నారు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అక్రమంగా చెల్లించిన బిల్లుల సొమ్మును రికవరీ చేస్తామని.. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సహా ఈ అవకతవకలతో సంబంధమున్న ఎవరినీ వదిలిపెట్టబోమని మంత్రి స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..