‘మహా’ కూటమిలో విభేదాల్లేవ్: ఉద్ధవ్
మహారాష్ట్రలోని సంకీర్ణ కూటమిలో విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలపై సీఎం ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు. కూటమిలో ఎలాంటి విభేదాల్లేవని స్పష్టంచేశారు. సంకీర్ణ ప్రభుత్వంలోని......
ముంబయి: మహారాష్ట్రలోని సంకీర్ణ కూటమిలో విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలపై సీఎం ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు. కూటమిలో ఎలాంటి విభేదాల్లేవని స్పష్టంచేశారు. సంకీర్ణ ప్రభుత్వంలోని భాగస్వామ్య పక్షాలు మంచి సమన్వయంతో ముందుకెళ్తున్నట్టు చెప్పారు. ‘మహా వికాస్ అఘాడీ’లోని శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ఎమ్మెల్యేలతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి పరస్పర సహకారంతో ముందుకెళ్తున్నట్టు చెప్పారు. ఈ బంధం మరింత బలోపేతమయ్యేలా పనిచేయాలని సూచించారు.
ఇటీవల దిల్లీకి వెళ్లిన సమయంలో సోనియాతో సమావేశం బాగా జరిగిందని ఉద్ధవ్ ఎమ్మెల్యేలతో చెప్పారు. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, కాంగ్రెస్ నాయకత్వంతో నిరంతరం టచ్లో ఉన్నట్టు వివరించారు. జపా చేస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దని సూచించినట్టు సమాచారం. మూడు పార్టీల సమన్వయ కమిటీ సమావేశంలో ఎన్పీఆర్, సీఏఏ తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు